News March 21, 2024
వలసల పర్వం మొదలైంది.. పార్టీలకు లాభం చేకూరేనా? – 3/3

ఈ చేరికలు కాంగ్రెస్కు బలం చేకూరుస్తాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీలోనూ అదే స్థాయి చేరికలు ఉంటున్నాయి. రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన 15 మంది కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. కేరళలో కాంగ్రెస్ కీలక నేత మహేశ్వరన్ నాయర్ సహా మధ్యప్రదేశ్లో 8 మంది ఇటీవల హస్తాన్ని వీడి కమలాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పోరు ఆసక్తిగా మారనుంది.
Similar News
News October 26, 2025
సజ్జనార్ డీపీ పెట్టుకుని..

TG: నేరస్థుల వెన్నులో వణుకు పుట్టించే IPS ఆఫీసర్ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్లో సజ్జనార్ డీపీ పెట్టుకుని మెసేజులు పంపుతున్నారు. అలాంటి మెసేజులకు స్పందించవద్దని, ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలు అసలే ఇవ్వొద్దని, డబ్బులు అడిగితే పంపవద్దని హెచ్చరించారు.
* సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930
News October 26, 2025
RTC, ప్రైవేట్ బస్సులకు తేడా ఏంటి?

ఆర్టీసీలో ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లు ఉంటారు. డ్యూటీకి ముందు ప్రతి డిపోలో ఆల్కహాల్ టెస్టు చేస్తారు కాబట్టి మద్యం తాగి బస్సు నడిపే అవకాశం ఉండదు. బస్సుకు స్పీడ్ లాక్ ఉండటంతో గంటకు 80 కి.మీ. వేగాన్ని దాటి వెళ్లలేదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ బస్సు డ్రైవర్లు రాత్రి వేళ్లలో గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం తాగే అవకాశమూ ఉంది.
News October 26, 2025
DRDOలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా?

<


