News November 15, 2024
మొదటిది ఎప్పటికీ ప్రత్యేకమే!

ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు పొందాల్సిందే. అయితే, తొలి ఆధార్ కార్డును ఎవరికి ఇచ్చారో తెలుసా? 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రకు చెందిన రంజనా సోనావానే అనే మహిళకు ఇచ్చారు. దీంతో ఆమె చరిత్రలో తొలి ఆధార్ పొందిన వ్యక్తిగా నిలిచిపోయారు. కాగా, భారత తొలి ఫైవ్ స్టార్ హోటల్ ముంబై తాజ్ హోటల్. తేజస్ ఎక్స్ప్రెస్ భారతదేశపు తొలి ప్రైవేట్ ట్రైన్, ఫస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ IIT రూర్కీ కావడం విశేషం.
Similar News
News December 12, 2025
అఖండ-2.. AICCకి షర్మిల ఫిర్యాదు!

అఖండ-2 టికెట్ ధరల పెంపు <<18532497>>వివాదం<<>> ఢిల్లీని తాకినట్లు తెలుస్తోంది. CM చంద్రబాబు చెబితేనే CM రేవంత్ రేట్లు పెంచారంటూ APCC చీఫ్ షర్మిల AICCకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాము CBNకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చెప్పింది చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే విషయమై INC పెద్దలు ఆరా తీసి TG ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు టాక్. దీంతో ఇకపై టికెట్ ధరలు పెంచబోమంటూ మంత్రి కోమటిరెడ్డి <<18543073>>ప్రకటించినట్లు<<>> సమాచారం.
News December 12, 2025
రేవంత్-మెస్సీ మ్యాచ్కు రాహుల్ గాంధీ

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు (శనివారం) హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్లో స్టార్ ప్లేయర్ మెస్సీ పాల్గొనే ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షించనున్నారు. ఈ మ్యాచ్ను చూసేందుకు రావాలని ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్, ప్రియాంక ఇతర నేతలను ఆహ్వానించడం తెలిసిందే. ఈ మ్యాచులో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఆటగాళ్లు మెస్సీ టీమ్తో పోటీపడనున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
News December 12, 2025
డిజిటల్ రూపంలో జనాభా లెక్కలు: అశ్వినీ వైష్ణవ్

2027 జనగణన నిర్వహణకు ₹11,718 కోట్లను కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. డేటా రక్షణను దృష్టిలో ఉంచుకుని జనాభా లెక్కల సమాచారం ఇకపై పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2027 జనాభా లెక్కలు మొట్టమొదటి డిజిటల్ జనాభా లెక్కలు అవుతాయన్నారు. 2దశల్లో జనాభా లెక్కలు నిర్వహిస్తారని వివరించారు. ముందు గృహాల గణన, జాబితా తయారీ, ఆపై జనగణన ఉంటుందన్నారు.


