News May 12, 2024

మొదటి ఓటు పార్లమెంట్ అభ్యర్థికి, రెండోది అసెంబ్లీ అభ్యర్థికి

image

AP ఎన్నికల్లో ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి అసెంబ్లీకి అయితే, మరొకటి పార్లమెంట్‌కి. ముందుగా పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాలి. ఆ తర్వాతే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థికి ఓటు వేయాలి. ఈ రెండు బ్యాలట్ యూనిట్లు వేర్వేరుగా ఉంటాయి. అటూ ఇటూ కాకుండా.. పోటీ చేసే అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తు చూసి EVMలపై బటన్లు నొక్కండి.
☞ మీ భవిష్యత్తును మార్చే అభ్యర్థిని ఎన్నుకోండి.

Similar News

News November 22, 2025

గుడిలో దండలు మార్చుకుని.. IASల ఆదర్శ వివాహం

image

AP: పెళ్లంటే ఆర్భాటం కాదు అర్థం చేసుకోవడమేనని నిరూపించారు ఇద్దరు ఐఏఎస్‌లు. విశాఖ కైలాసగిరి శివాలయంలో నిరాడంబరంగా దండలు మార్చుకుని, తర్వాత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకాలు చేసి దంపతులయ్యారు. అల్లూరి జిల్లా పాడేరు ITDA ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీపూజ, మేఘాలయలోని దాదెంగ్రి జాయింట్ కలెక్టర్ ఆదిత్య వర్మల వివాహ తంతు ఇలా సింపుల్‌గా పూర్తయ్యింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం విశేషం.

News November 22, 2025

ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలి?

image

భార్యాభర్తల్లో ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు. మొదటి వారం శ్రీనివాసుడి చిత్రపటం/విగ్రహాన్ని అలంకరించి, వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పాలి. కోరిన కోర్కెలు నెరవేరితే 7 కొండలు ఎక్కుతామని ముడుపు కట్టాలి. 7 వారాల పాటు 7 వత్తుల దీపం వెలిగించాలి. పూజ ఎలాగైనా చేయవచ్చు. శనివారాల్లో మద్యమాంసాల్ని ముట్టుకోకూడదు. చివరి వారం వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. వీలున్నప్పుడు తిరుపతి వెళ్లి ముడుపు సమర్పించాలి.

News November 22, 2025

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు!

image

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాలాలను బట్టి ఎండ, వానలు, చలి అన్నీ ఎక్కువగానే ఉంటున్నాయి. ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 273 రోజుల్లో 270 రోజులు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. ఈ ప్రభావంతో దేశంలో 4 వేల మందికి పైగా చనిపోయారని, 2.34 కోట్ల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని పేర్కొంది.