News August 31, 2024

విజయవాడ మృతులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

image

AP: విజయవాడ మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడిన <<13984102>>ఘటనపై <<>>సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం చాలా బాధాకరం. వారికి అండగా ఉంటాం. ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ఇస్తాం. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను అధికారులు వెంటనే గుర్తించాలి. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు.

Similar News

News February 18, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* రాబోయే 3 నెలలు చాలా కీలకం: CM రేవంత్
* TG: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం
* KCRకు తెలుగు రాష్ట్రాల CMలు బర్త్ డే విషెస్
* ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం: CM CBN
* రాజకీయాల్లోకి మళ్లీ రాను: కేశినేని నాని
* వచ్చే నెల 14న పిఠాపురంలో జనసేన ప్లీనరీ
* మహాకుంభమేళా@54.31 కోట్ల మంది
* ఉత్తర భారతంలో భూప్రకంపనల కలకలం
* 2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు

News February 18, 2025

BREAKING: కొత్త CECగా జ్ఞానేశ్ కుమార్

image

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌(CEC)గా జ్ఞానేశ్ కుమార్ ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జ్ఞానేశ్ కుమార్ పేరు గత కొన్ని రోజులుగా అందరి నోటా నానుతుండగా ఈరోజు అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రస్తుత CEC రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనుంది.

News February 18, 2025

ఎండాకాలం: ఈసారి హాటెస్ట్ సిటీగా బెంగళూరు!

image

దేశంలో ఈసారి ఎండలు మండిపోతాయని, అత్యంత వేడి నగరంగా బెంగళూరు నిలవనుందని IMD అంచనా వేసింది. ఏటా వేసవిలో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఢిల్లీ కంటే బెంగళూరులోనే రికార్డ్ స్థాయి టెంపరేచర్ నమోదవుతుందని పేర్కొంది. సిలికాన్ సిటీలో ఇవాళ 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఢిల్లీలో 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదవడం గమనార్హం.

error: Content is protected !!