News April 10, 2024

రాజధాని ఏదో ప్రభుత్వం తేల్చలేదు: ఆర్బీఐ జీఎం

image

AP: అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. రాజధాని ఏదో ఏపీ ప్రభుత్వం తేల్చలేదని ఆర్బీఐ జీఎం సుమిత్ తెలిపారు. గుంటూరుకి చెందిన జాస్తి వీరాంజనేయులు అనే వ్యక్తి రాసిన లేఖకు ఆయన సమాధానమిచ్చారు. అయితే 2016లోనే అమరావతిలో ఆర్బీఐకి 11 ఎకరాలు కేటాయించారని.. కేంద్ర ప్రభుత్వం మ్యాప్‌లోనూ ఏపీ రాజధానిని అమరావతిగా గుర్తించిందని వీరాంజనేయులు గుర్తు చేశారు.

Similar News

News March 21, 2025

యశ్వంత్ వర్మపై విచారణకు సుప్రీం ఆదేశం

image

ఢిల్లీ హైకోర్టు జడ్జి <<15834106>>యశ్వంత్ వర్మ<<>> ఇంట్లో భారీగా నగదు బయటపడిన వ్యవహారంపై సుప్రీం కోర్టు అంతర్గత విచారణకు ఆదేశించింది. హైకోర్టు సీజే నుంచి నివేదిక కోరింది. వర్మ నివాసంలో రూ.50కోట్ల వరకు నగదు బయటపడినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ డబ్బంతా ఎవరిదన్న కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. కాగా వర్మపై ఇప్పటికే బదిలీ వేటు పడింది.

News March 21, 2025

IPL కామెంటేటర్‌గా ఇండియన్ అంపైర్

image

భారత్‌కు చెందిన అంపైర్ అనిల్ చౌదరి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక నుంచి కామెంటేటర్‌గా కొనసాగనున్నారు. ఢిల్లీకి చెందిన ఆయన 2013-2025 వరకు 12 టెస్టులు, 49 ODIs, 64 T20s, 131 IPL, 91 ఫస్ట్ క్లాస్, 114 లిస్ట్-A మ్యాచులకు అంపైరింగ్ చేశారు. ఇలా అంతర్జాతీయ మ్యాచులకు అంపైర్‌గా చేసి ఫుల్ టైమ్ కామెంటేటర్‌గా మారిన తొలి భారత అంపైర్‌గా నిలిచారు. ఇప్పుడు IPLలో హర్యాన్వి, హిందీలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

News March 21, 2025

76 ఏళ్ల వయసులో తల్లయిన మహిళ

image

ఇథియోపియా దేశంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మెకెల్లే ప్రాంతానికి చెందిన మెధిన్ హాగోస్ అనే మహిళ 76 ఏళ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చారు. తాను సహజ పద్ధతిలోనే గర్భం దాల్చినట్లు ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా, ఇంత లేటు వయసులో సహజంగా గర్భం దాల్చడం సాధ్యం కాకపోవచ్చని పలువురు నెటిజన్లు అంటున్నారు. IVF విధానంలో ప్రెగ్నెంట్ అయ్యుంటారని కామెంట్స్ చేస్తున్నారు.

error: Content is protected !!