News October 28, 2024
రుడా ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు
TG:రామగుండం కార్పొరేషన్ కేంద్రంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. పెద్దపల్లి జిల్లా మొత్తాన్ని రుడా పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు 191 గ్రామాలను దీని పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో చేరడంపై గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక ప్రభుత్వం GO జారీ చేసే ఛాన్సుంది.
Similar News
News October 28, 2024
సుప్రీమ్ లీడర్ అకౌంట్ సస్పెండ్ చేసిన X
ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హీబ్రూ అకౌంట్ను X సస్పెండ్ చేసినట్టు జెరూసలేం పోస్ట్ తెలిపింది. ‘జియోనిస్టు ప్రభుత్వం తప్పు చేసింది. తమ సమీకరణాల్లో ఇరాన్ను తక్కువగా లెక్కగట్టింది. మాకెలాంటి శక్తి, సామర్థ్యం, ఆకాంక్షలు ఉన్నాయో అర్థమయ్యేలా చేస్తాం’ అని ఆదివారం ఖమేనీ పోస్ట్ చేశారు. ‘దయామయుడైన అల్లా పేరుతో…’ అని శనివారం పెట్టారు. ఇవి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి తర్వాత చేసినవే కావడం గమనార్హం.
News October 28, 2024
నేషనల్ వార్ మెమోరియల్ను సందర్శించిన సాయిపల్లవి
ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ని సందర్శించిన ఫొటోలను హీరోయిన్ సాయిపల్లవి పంచుకున్నారు. ‘అమరన్ సినిమా ప్రమోషన్లను ప్రారంభించే ముందు అక్కడికి వెళ్లాలనుకున్నా. మనకోసం ప్రాణాలు అర్పించిన సైనికుల జ్ఞాపకార్థం ఇక్కడ వేలాది ఇటుకలను ఉంచారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ AC(P)& సిపాయి విక్రమ్ సింగ్లకు నివాళి అర్పిస్తూ నేను భావోద్వేగానికి లోనయ్యా’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా ‘అమరన్’ ఈనెల 31న రిలీజ్ కానుంది.
News October 28, 2024
రైతులను దివాలా తీయిస్తారా?: KTR
TG: రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనడం లేదన్న మీడియా కథనాలపై మాజీ మంత్రి KTR స్పందించారు. ‘దసరాకే కాదు. దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా? కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే. రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రాజకీయాల్లో రాక్షసక్రీడలను మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి’ అని కోరారు.