News February 12, 2025
ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.35వేలు ఇవ్వాలి: కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738600740850_367-normal-WIFI.webp)
TG: ప్రతి మహిళకు నెలకు ₹2,500 చొప్పున ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని MLC కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిందని, ఒక్కో మహిళకు సర్కార్ ₹35వేలు జమ చేయాలని అన్నారు. మహిళా దినోత్సవంలోపు ఈ హామీని నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో పోరాడతామని హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
Similar News
News February 12, 2025
రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739323607751_782-normal-WIFI.webp)
AP: రైతులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూములు రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని ‘ఆంధ్రప్రదేశ్ రాజముద్ర’ ఉన్న వాటిని ఇవ్వనున్నారు. పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండటంతో రైతులు తిరస్కరిస్తున్నారని మంత్రి అనగాని CM చంద్రబాబుకు తెలిపారు. అలాగే సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు కూడా మార్చి నాటికి తొలగిస్తామన్నారు.
News February 12, 2025
బాగా ఆడినా జట్టు నుంచి తప్పించారు: రహానే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739327200178_1226-normal-WIFI.webp)
భారత క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో సెంచరీ చేసినా తర్వాతి మ్యాచుల్లో జట్టులోకి తీసుకోలేదని అన్నారు. శతకం నమోదు చేసినా జట్టు నుంచి తప్పించినట్లు చెప్పారు. ఆస్ట్రేలియాతో సిరీస్లో భారత్ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని రహానేను జట్టులోకి తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. అనుభవం ఉన్న ఆటగాడు ఉంటే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు మేలు జరగుతుందని అంటున్నారు.
News February 12, 2025
ఇజ్రాయెల్ vs హమాస్.. మళ్లీ యుద్ధం తప్పదా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739324030252_367-normal-WIFI.webp)
ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ శనివారం మధ్యాహ్నం లోపు తమ దేశ బందీలను విడిచిపెట్టకపోతే గాజాపై సైనిక చర్యకు దిగుతామని, సీజ్ఫైర్ డీల్ ముగుస్తుందని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. హమాస్ అంతు చూసే వరకు నిద్రపోమని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇదే మాట చెప్పారు. అయితే ట్రంప్ ఒప్పందాలను గౌరవించాలని, ఆయన హెచ్చరికలను తాము పట్టించుకోమని హమాస్ తేల్చి చెప్పింది.