News January 6, 2025

GOOD NEWS చెప్పిన ప్రభుత్వం

image

TG: ఈ నెల 26 నుంచి ప్రభుత్వం రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇందుకోసం రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే చేసి 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీని ప్రకారం వ్యవసాయం చేసే భూములకే డబ్బులు అందనున్నాయి. ఈ స్కీం కింద ఏడాదికి ఎకరానికి రూ.12వేలు అందుతాయి.

Similar News

News January 24, 2025

దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు

image

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఐటీ అధికారులు దిల్ రాజును సాగర్ సొసైటీలోని ఆయన కార్యాలయానికి తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ సోదాలు లేదా పలు అంశాలపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

News January 24, 2025

క్రికెటర్ల వరుస విడాకులు.. అసలేం జరుగుతోంది!

image

భారత క్రికెటర్లు విడాకులు తీసుకోవడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. కొందరు ప్రొఫెషనల్ కెరీర్లో సక్సెస్ అయినా కుటుంబ వ్యవహారాల్లో ఫెయిల్ అవుతున్నారు. స్పిన్నర్ చాహల్, తన భార్య ధనశ్రీ విడిపోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తన 20ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పేందుకు సిద్ధమైనట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. కాగా ధవన్, షమీ, పాండ్య ఇప్పటికే విడాకులు తీసుకున్నారు.

News January 24, 2025

విలపించిన సంజూ.. కాపాడిన ద్రవిడ్

image

రాహుల్ ద్రవిడ్ వల్లే సంజూశాంసన్ ఇప్పుడీ స్థాయిలో ఉన్నాడని అతడి తండ్రి విశ్వనాథ్ అన్నారు. KCA అతడి కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఆయనే కాపాడారని వెల్లడించారు. ‘ఓసారి నా కొడుకుపై KCA యాక్షన్ తీసుకుంది. అతడి కిట్, సామగ్రి లాక్కుంది. ఆ టైమ్‌లో ద్రవిడ్ కాల్ చేయగానే సంజూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. బాధపడొద్దని చెప్పిన ద్రవిడ్ అతడిని NCAకు తీసుకెళ్లి శిక్షణనిచ్చారు’ అని వివరించారు.