News January 31, 2025
సన్యాసిగా మారిన హీరోయిన్.. ట్విస్ట్

మహా కుంభమేళా వేదికగా <<15247035>>సాధ్విగా<<>> మారిన హీరోయిన్ మమతా కులకర్ణికి ఎదురుదెబ్బ తగిలింది. కిన్నెర అఖాడా నుంచి ఆమెను తొలగిస్తూ ఫౌండర్ రిషి అజయ్ దాస్ ప్రకటన జారీ చేశారు. మమతను సాధ్విగా ప్రకటించిన లక్ష్మీనారాయణ త్రిపాఠిని కూడా తప్పిస్తున్నట్లు తెలిపారు. రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటూ గ్లామర్ ప్రపంచానికి చెందిన వ్యక్తికి ఏకంగా ‘మహామండలేశ్వర్’ స్థానాన్ని కట్టబెట్టడం సనాతన ధర్మానికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
Similar News
News January 18, 2026
నాన్వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్లు వేసుకోవాలి. నాన్వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.
News January 18, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 18, 2026
కనకాంబరంలో ఎండు తెగులు నివారణ ఎలా?

కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్లడం వల్ల మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఎండు తెగులు నివారణకు తెగులు ఆశించిన మొక్కల మొదళ్లు తడిచేలా.. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి.. ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి.


