News January 22, 2025
రంజీ జెర్సీలో మెరిసిన హిట్ మ్యాన్

ముంబై తరఫున రంజీ మ్యాచ్లు ఆడేందుకు రోహిత్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి జమ్మూకశ్మీర్తో జరగనున్న రంజీ మ్యాచ్లో బరిలోకి దిగనున్న హిట్మ్యాన్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ రంజీ జెర్సీలో మెరిశారు. కొత్త జెర్సీలో ఫేవరెట్ క్రికెటర్ను చూసిన ఫ్యాన్స్ రంజీల్లోనూ అదరగొట్టాలని పోస్టులు పెడుతున్నారు. ముంబై జట్టుకు రహానే కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News February 15, 2025
రూ.100 కోట్లకు చేరువలో ‘తండేల్’

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. విడుదలైన 8 రోజుల్లోనే రూ. 95.20 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలో రూ.100 కోట్ల మార్కును అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
News February 15, 2025
కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి: రకుల్

కంఫర్ట్ జోన్ ప్రజలను ఎదగనీయదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘మీకు అలవాటైన ప్రదేశం నుంచి బయటకు రండి. అలవాటైన ప్రాంతం అందంగా ఉంటుంది. కానీ అది మిమ్మల్ని ఏ విషయంలోనూ ఎదగనీయదు. మీరు ఎదగాలంటే అక్కడి నుంచి బయటపడాలి. కఠినమైన విషయాలు నేర్చుకోవాలి. కొత్తదనాన్ని కోరుకోవాలి. సుఖవంతమైన జీవితం అందరినీ బద్ధకస్థులుగా మారుస్తుంది.’ అంటూ రాసుకొచ్చారు.
News February 15, 2025
14 ఏళ్లకే లక్ష మొక్కలు నాటింది

తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన 14 ఏళ్ల ప్రసిద్ధి సింగ్ లక్ష మొక్కలు నాటారు. ‘ప్రసిద్ధి ఫారెస్ట్ ఫౌండేషన్’ స్థాపించి ‘చెట్ల అమ్మాయి’గా ప్రసిద్ధి పొందారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో ఆమె మొక్కలు నాటారు. 110 ప్రాంతాల్లో 1.3 లక్షలకుపైగా వాటిని నాటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తోంది. అడవుల కోసం ఆమె చేస్తున్న కృషికిగానూ ఆ రాష్ట్ర ప్రభుత్వం PM రాష్ట్రీయ బాల్ పురస్కార్ ప్రకటించింది.