News December 3, 2024
మృతుల గుర్తింపు కార్డుల్ని ఇలా రద్దు చేయాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733229149773_1045-normal-WIFI.webp)
ఓ వ్యక్తి చనిపోతే అతడికి ఉన్న పాన్, ఆధార్ వంటి గుర్తింపు కార్డుల్ని సంబంధీకులు ఎలా రద్దు చేయాలి? AADHAR: UIDAI పోర్టల్లో డెత్ సర్టిఫికెట్ సమర్పించాలి. PAN: IT శాఖ కార్యాలయంలో ఫామ్-30 నింపి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి. VOTER ID: ఎన్నికల కార్యాలయంలో ఫామ్-7 నింపి డెత్ సర్టిఫికెట్ సమర్పించాలి. PASSPORT: పాస్పోర్టు కార్యాలయంలో పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి. DRIVING LICENCE: RTO కార్యాలయాన్ని సంప్రదించాలి.
Similar News
News January 20, 2025
నేటి నుంచి WEF.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737334615397_1226-normal-WIFI.webp)
ప్రపంచ ఆర్థిక సదస్సు(WEF) నేటి నుంచి దావోస్లో ప్రారంభం కానుంది. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు వెళ్లారు. మూడు రోజులపాటు CBN బృందం, నాలుగు రోజుల పాటు రేవంత్ బృందం సమావేశంలో పాల్గొననుంది. భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై ఇరురాష్ట్రాల సీఎంలు దృష్టిపెట్టారు. ఈ సదస్సులో భారత్ సహా పలు దేశాలకు చెందిన 2,800 మంది నేతలు పాల్గొంటారు.
News January 20, 2025
నీరజ్ చోప్రా భార్య ఎవరో తెలుసా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737331747325_1226-normal-WIFI.webp)
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ <<15200143>>నీరజ్ చోప్రా పెళ్లి<<>> చేసుకున్న అమ్మాయి పేరు హిమాని మోర్. హరియాణాలోని సోనిపట్కు చెందిన 25 ఏళ్ల హిమాని జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్. ఢిల్లీలోని మిరండా హౌజ్ కాలేజీలో రాజనీతిశాస్త్రం, వ్యాయామ విద్యలో డిగ్రీ చేశారు. ప్రస్తుతం అమెరికాలోని ఓ యూనివర్సిటీలో క్రీడలకు సంబంధించిన కోర్సు చేస్తున్నారు.
News January 20, 2025
కాళేశ్వరం విచారణ.. నేడు KCRకు నోటీసులు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737333648031_1226-normal-WIFI.webp)
TG: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చివరి దశకు చేరింది. రేపటి నుంచి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనుంది. మాజీ CM కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్(మాజీ ఆర్థిక మంత్రి)ను విచారణకు పిలిచే అవకాశముంది. ఇవాళ ఈ నేతలకు సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కమిషన్ నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, రిటైర్డ్ ఇంజినీర్లతో పాటు ఇతర అధికారులను ప్రశ్నించింది.