News September 29, 2024
ఆ సమాచారం ఇచ్చింది ఇరాన్ గూఢచారి!

హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా జాడను పసిగట్టడానికి ఇరాన్ గూఢచారి సాయాన్ని ఇజ్రాయెల్ తీసుకున్నట్టు ఫ్రెంచ్ పత్రిక తెలిపింది. ఓ సమావేశంలో పాల్గొనేందుకు బీరూట్ దక్షిణ శివారులోని హెజ్బొల్లా భూగర్భ ఆఫీసుకు నస్రల్లా చేరుకున్నారు. ఈ సమాచారాన్ని ఇరాన్ గూఢచారి ఇజ్రాయెల్కు చేరవేసినట్టు పేర్కొంది. సమాచారాన్ని ధ్రువీకరించుకున్న ఇజ్రాయెల్ గంటల వ్యవధిలోనే బీరూట్పై దండెత్తి నస్రల్లాను హతమార్చింది.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


