News November 25, 2024
తొలి రోజు ముగిసిన ఐపీఎల్ వేలం

ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. రేపు కూడా ఆక్షన్ కొనసాగనుంది. ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్గా రిషభ్ పంత్(రూ.27 కోట్లు-LSG) నిలిచారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(రూ.26.75కోట్లు-PBKS) నిలిచారు. మొత్తం 72 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఇంకా డుప్లెసిస్, విలియమ్సన్, సామ్ కరన్, భువనేశ్వర్, సుందర్, డేవిడ్ వంటి ప్లేయర్ల భవితవ్యం రేపు తేలనుంది.
Similar News
News October 23, 2025
ఆస్ట్రేలియన్ ప్లేయర్ రికార్డు సెంచరీ

ఆస్ట్రేలియన్ ప్లేయర్ గార్డ్నర్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. WWCలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచారు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో 69 బంతుల్లోనే 15 ఫోర్లతో శతకం బాదారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఛేదనలో గార్డ్నర్(104*), అన్నాబెల్(98*) విజృంభించడంతో ఆస్ట్రేలియా 40.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
News October 23, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 23, 2025
తెరపైకి గుమ్మడి నర్సయ్య జీవితకథ.. టైటిల్ రోల్లో స్టార్ హీరో

ప్రజానాయకుడు, సైకిల్పై అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేగా పేరున్న గుమ్మడి నర్సయ్య జీవిత కథ సినిమాగా రానుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ మేరకు మూవీ యూనిట్ విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి పరమేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు శాసనసభ నుంచి ఐదు సార్లు MLAగా ఎన్నికయ్యారు.