News March 11, 2025
మొదలైన ఐపీఎల్ సందడి

ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో దేశంలో IPL ఫీవర్ ప్రారంభమైంది. ఆయా జట్ల ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే తమ జట్లతో చేరుతున్నారు. RCB కెప్టెన్ రజత్ పాటిదార్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ టీమ్తో జతకలిశారు. కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ (RCB), నోకియా, డికాక్, రమణ్దీప్ సింగ్ (KKR) తదితరులు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టారు. ఈ నెల 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది.
Similar News
News February 9, 2026
PDPL: 48 గంటల సైలెన్స్ పీరియడ్: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగింపు ముందు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష తెలిపారు. FEB 9 సాయంత్రం 5 గంటల నుంచి FEB 11 పోలింగ్ ముగిసే వరకు PDPL, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రచారం, రాజకీయ ప్రసంగాలు, ఫలితాలను ప్రభావితం చేసే వార్తల ప్రచారం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 9, 2026
అంబటి రాంబాబుకు బెయిల్

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో YCP నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మరో కేసులో ఇవాళ మధ్యాహ్నం స్పెషల్ జుడీషియల్ కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మొదటి కేసులో బెయిల్ లభించినా ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అటు రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 52 కేసులు నమోదైనట్లు సమాచారం.
News February 9, 2026
రెండేళ్లలో ఇద్దరు పిల్లలు.. తల్లులపై తీవ్ర ప్రభావం

వెంటవెంటనే ఇద్దరు పిల్లలను కనడం తల్లులపై తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి శరీరం పూర్తిగా కోలుకోకముందే మరోసారి గర్భం దాల్చడం వలన అలసట, రక్తహీనత, నిద్రలేమి, డిప్రెషన్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇద్దరి పిల్లల మధ్య కనీసం 18 నెలల నుంచి 3 ఏళ్ల గ్యాప్ ఉంటే తల్లి ఆరోగ్యంగా ఉండటంతో పాటు తోబుట్టువుల మధ్య బాండ్ బలంగా ఉంటుందని సూచిస్తున్నారు.


