News May 10, 2024

డబ్బుల జమ వ్యవహారం.. ప్రభుత్వంపై ఈసీ ప్రశ్నల వర్షం

image

AP: డబ్బుల జమ పథకాలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి EC లేఖ రాసింది. ‘బటన్ నొక్కి చాలా రోజులైంది. ఈరోజే నగదు బదిలీ చేయకపోతే ఏమవుతుంది? జనవరి 24 నుంచి మార్చి 24వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియజేయండి. ఇప్పటివరకు ఎందుకు జమ చేయలేకపోయారు. ఈ ఐదేళ్లలో బటన్ నొక్కిన సమయానికి, నిధుల బదిలీకి మధ్య వ్యవధి ఎంత? పోలింగ్ తేదీకి ముందే ఎందుకు జమ చేయాలనుకుంటున్నారు?’ అంటూ EC ప్రశ్నల వర్షం కురిపించింది.

Similar News

News March 11, 2026

సర్‌ప్రైజింగ్.. రోడ్డుపై గుంత వల్ల దక్కిన ప్రాణం!

image

UPకి చెందిన వినీత శుక్లా(50) మరణం అంచులకు చేరి తిరిగి ప్రాణాలతో బయటపడ్డారు. డాక్టర్లు ఆమెను ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తున్నారు. NH-74పై ఉన్న ఓ పెద్ద గుంత వల్ల వాహనం తీవ్ర కుదుపునకు లోనైంది. దాంతో ఆమెలో మళ్లీ చలనం మొదలై శ్వాస తీసుకోవడం ప్రారంభించారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె కోలుకుని ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.

News March 11, 2026

‘కరోనా’కు ఆరేళ్లు

image

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసిన కరోనాను WHO ‘మహమ్మారి’గా ప్రకటించి నేటికి ఆరేళ్లు. చైనాలో మొదలైన ఈ వైరస్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. వైద్యులు, శాస్త్రవేత్తల కృషితో వచ్చిన టీకాలు వైరస్ కట్టడికి దోహదపడ్డాయి. రోజులు గడిచిపోతున్నా ఆనాటి చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మీ కామెంట్?

News March 11, 2026

ఫిరాయింపు MLA కేసులో క్లీన్ చిట్.. KTR ఫైర్

image

TG: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ <<19352106>>క్లీన్ చిట్<<>> ఇవ్వడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. ‘కాంగ్రెస్ బీఫామ్‌పై MPగా పోటీ చేసిన వారికే క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమే. అధికార పార్టీ కోసం రాజ్యాంగ వ్యవస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు’ అని KTR హెచ్చరించారు.