News August 22, 2024
ఏపీలో వాలంటీర్ల కీలక నిర్ణయం!

AP: ఉద్యోగ భద్రతపై ఆందోళనలో ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లు ఉద్యమానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన రూ.10,000 గౌరవ వేతనం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో దానిపై నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల 31న విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ ప్రణాళిక రూపొందించాలని భావిస్తున్నారు.
Similar News
News July 10, 2025
త్వరలో ఆదర్శ రైతుల ద్వారా పథకాల అమలు: రైతు కమిషన్

TG: త్వరలో గ్రామానికి ఒక ఆదర్శ రైతును ఎంపిక చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ స్కీములను వారి ద్వారా అమలు చేస్తామన్నారు. అయితే ఆదర్శ రైతులకు వేతనాలు ఉండవని స్పష్టం చేశారు. కాగా 2007లో కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. గౌరవ వేతనం కింద నెలకు రూ.1,000 అందించింది. 2017లో BRS ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసింది.
News July 10, 2025
8th పే కమిషన్: భారీగా పెరగనున్న జీతాలు!

8th పే కమిషన్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇది అమలైతే జీతాలు, పెన్షన్లు 30-34% పెరుగుతాయని Ambit Capital(ఫైనాన్షియల్ అడ్వైజర్) అంచనా వేసింది. 44లక్షల మంది ఉద్యోగులు, 68లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. బేసిక్ పే, అలవెన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయంది. కాగా కొత్త పే స్కేల్ 2026 JAN నుంచి అమలవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.
News July 10, 2025
చంద్రబాబుకు కవిత లేఖ

TG: పునర్విభజన సమయంలో APలో కలిపిన 5 గ్రామాలు ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడును తిరిగి TGలో విలీనం చేయాలని AP CM చంద్రబాబుకు BRS MLC కవిత లేఖ రాశారు. పోలవరం ముంపు పేరిట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను చీకటి ఆర్డినెన్స్ ద్వారా విలీనం చేసుకున్నారని ఆరోపించారు. ఫలితంగా లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ను లాగేసుకొని TGలో కరెంట్ కష్టాలకు కారకులయ్యారని కవిత దుయ్యబట్టారు.