News July 9, 2024

HYD జూలో ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకున్న సింహం.. 20 నిమిషాల్లోనే!

image

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని ఎన్‌క్లోజర్ నుంచి ఆఫ్రికన్ లేడీ సింహం శిరీష తప్పించుకుంది. ఎన్‌క్లోజర్ శుభ్రం చేశాక డోర్లు సరిగ్గా మూయకపోవడంతో ఉదయం 10.20 గంటలకు శిరీష తప్పించుకుంది. అప్పటికే పక్షవాతంతో చికిత్స పొందుతోన్న ఈ సింహాన్ని 20 నిమిషాల తర్వాత ఎన్‌క్లోజర్‌లోకి చేర్చినట్లు అధికారులు తెలిపారు. గేట్లన్నీ మూసేసి సింహాన్ని బంధించామని, ఓ యానిమల్ కీపర్‌కి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.

Similar News

News December 12, 2025

పాకిస్థాన్‌లో సంస్కృతం, మహాభారతం కోర్సులు

image

పాకిస్థాన్‌లోని లాహోర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌లో (LUMS) సంస్కృతాన్ని అధికారిక కోర్సుగా ప్రారంభిస్తున్నారు. దీంతో పాటు మహాభారతం, భగవద్గీత శ్లోకాలను సైతం విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. అయితే దీని వెనుక ప్రొఫెసర్‌ షాహిద్‌ రషీద్‌ కృషి ఉంది. రాబోయే 10-15 ఏళ్లలో పాకిస్థాన్‌ నుంచి భగవద్గీత, మహాభారతానికి చెందిన స్కాలర్లు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

News December 12, 2025

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

image

జియో స్టార్‌తో తమ కాంట్రాక్ట్ కొనసాగుతుందని ICC స్పష్టం చేసింది. క్రికెట్ మ్యాచుల స్ట్రీమింగ్ రైట్స్‌ను జియో రద్దు చేసుకోనుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ప్రకటన విడుదల చేసింది. రానున్న టీ20 WCతో పాటు ICC ఈవెంట్లన్నింటినీ నిరంతరాయంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై జియో హాట్‌స్టార్‌లో ఫ్రీగా మ్యాచులు చూడలేమనుకున్న యూజర్లకు ఈ ప్రకటన భారీ ఊరట కలిగించింది.

News December 12, 2025

వాజ్‌పేయితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సత్యకుమార్

image

AP: అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సత్యకుమార్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘వాజ్‌పేయ్‌కు-నాకు-కర్నూలుకు ఓ అనుబంధం ఉంది. నేను 1993లోనే ఢిల్లీ వెళ్లడంతో వాజ్‌పేయ్‌తో పరిచయమైంది. 2018లో వాజ్‌పేయ్ కీర్తిశేషులయ్యాక ఆయన అస్థికలను ఢిల్లీ నుంచి తెచ్చి నా చేతుల మీదుగా పవిత్ర తుంగభద్ర నదిలో కలిపే అవకాశం దక్కింది’ అని తెలిపారు.