News January 17, 2025

100 ఏళ్లుగా కుంభమేళాకు వస్తున్న స్వామి

image

యూపీకి చెందిన యోగా సాధకులు స్వామి శివానంద 100 ఏళ్లుగా ప్రతి కుంభమేళాకు హాజరవుతున్నారని ఆయన శిష్యులు చెబుతున్నారు. ఆధార్ ప్రకారం ఆయన వయసు 129 ఏళ్లు. ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 16వద్ద ఆయన క్యాంపు ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం యోగా చేస్తుండగా ఆయన కోసం భక్తులు క్యూ కడుతున్నారు. ఆయన ఉప్పు, నూనె లేకుండా ఉడికించిన ఆహారం తీసుకుంటారని తెలిపారు. రెండేళ్ల క్రితం ఆయనను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది.

Similar News

News March 14, 2025

ఇన్సూరెన్స్ కంపెనీ కొంటున్న బాబా రాందేవ్

image

FMCG మేజర్, బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. మాగ్మా ఇన్సూరెన్స్‌లో తన 90% వాటాను పతంజలి, DS గ్రూప్‌నకు విక్రయిస్తున్నట్టు అదార్ పూనావాలా ప్రకటించారు. ఈ డీల్ విలువ రూ.4500 కోట్లని తెలుస్తోంది. ప్రస్తుతం వెహికల్, హెల్త్, పర్సనల్ యాక్సిడెంట్, హోమ్, కమర్షియల్ ఇన్సూరెన్స్ సేవలను మాగ్మా అందిస్తోంది. FY24లో కంపెనీ GWP రూ.3,295 కోట్లుగా ఉంది.

News March 14, 2025

గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాప్టరా?: వైసీపీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి కూడా రూ.లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశినాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు.. వినిపించదు’ అని ట్వీట్ చేసింది.

News March 14, 2025

NEPని ఒప్పుకోనందుకు రూ.2,152 కోట్లు ఇవ్వలేదు: తమిళనాడు మంత్రి

image

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అంగీకరించనందుకు కేంద్రం తమిళనాడుకు రూ.2,152 కోట్లు విడుదల చేయలేదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. ‘మా రాష్ట్రంలో మూడు భాషల విధానాన్ని అంగీకరించనందుకు కేంద్రం ఆ నిధులను ఆపింది. అయినా ఫర్వాలేదు. ప్రభుత్వ విద్యార్థుల సంక్షేమం, టీచర్ల జీతాలు, ఇతర ఖర్చుల కోసం మా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం’ అని బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు.

error: Content is protected !!