News March 30, 2024

కండక్టర్ల నిర్వాకం.. ప్రభుత్వంపై భారీ భారం

image

TG: మహిళలకు RTC బస్సుల్లో ఫ్రీ జర్నీ కోసం జీరో టికెట్ల జారీలో కండక్టర్లు తిరకాసు చేస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియోను పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తుండటంతో అవసరం లేకపోయినా ఎక్కువ జీరో టికెట్లు ఇచ్చేస్తున్నారు. వరంగల్ రీజియన్‌లో ఓ కండక్టర్ అదనంగా రూ.లక్ష విలువైన టికెట్లు జారీచేశారు. చాలా చోట్ల ఇలానే జరుగుతుండటంతో ఈ డబ్బులు చెల్లించే ప్రభుత్వంపై భారీ భారం పడుతోంది.

Similar News

News October 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 36 సమాధానాలు

image

1. దశరథుడి తల్లి ఇందుమతి.
2. పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉంటారు.
3. విష్ణువు ధనస్సు పేరు ‘సారంగం’.
4. తెలంగాణలోని భద్రాచలం ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది.
5. శుక అంటే చిలుక అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 15, 2025

బిహార్ ఎన్నికలకు 12 మందితో BJP రెండో జాబితా

image

బిహార్ ఎన్నికలకు BJP 12 మంది అభ్యర్థులతో రెండో విడత జాబితాను విడుదల చేసింది. NDAలోని పార్టీలతో ఒప్పందంలో భాగంగా BJP 101 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటివరకు 83 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా ఇంకా 18 సీట్లకు ప్రకటించాల్సి ఉంది. కూటమిలోని జేడీయూ 48 మందితో జాబితాను ప్రకటించింది. మరోవైపు JSP 51 స్థానాలకు, ఆమ్ ఆద్మీ పార్టీ 59 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి.

News October 15, 2025

సాయంకాలం నిద్రపోతున్నారా?

image

పగలు ముగిసి, రాత్రి మొదలయ్యే సమయంలో దేవతలందరూ శివ తాండవ వీక్షణలో తన్మయత్వం పొందుతూ ఉంటారు. అందువల్ల దైవ రక్షణ ప్రభావం కొంత మేర తగ్గుతుంది. ఈ అవకాశాన్ని అసుర శక్తులు వాడుకుంటాయి. ప్రజలను బాధించడానికి నిద్ర రూపంలో మనలోకి ప్రవేశించాలని చూస్తాయి. ఈ బలహీనతలకు మనం లొంగితే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ వేళలో నిద్ర పోవద్దని పెద్దలు అంటుంటారు. * మరిన్ని ధర్మ సందేహాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.