News November 9, 2024
విద్యార్థుల నిరసనపై స్పందించిన మంత్రి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జోడూరు పాఠశాలలో గిరిజన విద్యార్థులు తమకు టీచర్ కావాలంటూ <<14563913>>నిరసన<<>> వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. టీచర్ను నియమించాలని ఐటీడీఏ పీవోను ఆదేశించినట్లు తెలిపారు. సోమవారం నుంచి ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటారని చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
Similar News
News October 20, 2025
‘K-Ramp’ రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. శనివారం ఇండియాలో దాదాపు రూ.2.25 కోట్లు(నెట్) వసూలు చేసిన ఈ మూవీ ఆదివారం రూ.2.85 కోట్ల వరకు రాబట్టినట్లు Sacnilk ట్రేడ్ వెబ్సైట్ తెలిపింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.5.1 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఇవాళ హాలిడే నేపథ్యంలో కలెక్షన్స్ పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేసింది.
News October 20, 2025
APPLY NOW: 36 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

ముంబైలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ (SAMEER) 36 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ను బట్టి టెన్త్, ITI, NVCT/NAC, డిప్లొమా, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు OCT 31వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష,స్కిల్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PWBDలకు రూ.100. వెబ్సైట్:sameer.gov.in/
News October 20, 2025
దీపావళికి, గుడ్లగూబకు సంబంధమేంటి?

దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారన్న విషయం తెలిసిందే! ఆ అమ్మవారి వాహనమే గుడ్లగూబ. అందుకే నేడు ఆ పక్షిని చూస్తే శుభం కలుగుతుందని చెబుతుంటారు. అయితే ఉత్తర భారతదేశంలో ఈ పక్షిని బలిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. కానీ ఇది మూఢ నమ్మకమేనని పండితులు చెబుతున్నారు. ఈ నమ్మకాలను ఆసరాగా చేసుకొని గుడ్లగూబ వేటగాళ్లు అక్రమ వ్యాపారం చేసి డబ్బు సంపాదించడం కోసం ఇలాంటి దుష్ప్రచారాన్ని సృష్టించార’ని అంటున్నారు.