News October 16, 2024
దర్యాప్తు జరుగుతుండగా రిజైన్ చేసిన ముడా చీఫ్

ముడా స్కామ్ కేసుపై వేగంగా దర్యాప్తు జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ మారిగౌడ అనారోగ్య కారణాలతో పదవికి రిజైన్ చేశారు. ముడాలో భూముల సేకరణ, పంపిణీలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. మైసూరులో అక్రమంగా 14 ప్లాట్లు పొందారన్న ఆరోపణలతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, అతడి భార్య పార్వతి, బావమరిదిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ స్కామ్పై లోకాయుక్త, ED వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి.
Similar News
News January 29, 2026
పేపర్ ప్లేట్గా బ్యాంకు డాక్యుమెంట్.. ప్రైవసీ అంటే ఇదేనా?

కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్న బ్యాంకు డాక్యుమెంట్ రోడ్డు పక్కన పేపర్ ప్లేట్గా మారడం ఇప్పుడు వైరలవుతోంది. పేరు, లొకేషన్, పేమెంట్ డీటెయిల్స్ వంటి సెన్సిటివ్ డేటా బహిరంగంగా కనిపించడంతో నెటిజన్లు షాకవుతున్నారు. కస్టమర్ డేటాను బ్యాంకులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేస్తాయని ప్రశ్నిస్తున్నారు. Moronhumor పేరిట ఉన్న X అకౌంట్లో ఈ ఫొటో చూశాక డేటా ప్రైవసీపై SMలో పెద్ద చర్చే నడుస్తోంది.
News January 29, 2026
RBIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News January 29, 2026
KCRకు నోటీసుల్లో దురుద్దేశం లేదు: మహేశ్గౌడ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు నోటీసులివ్వడంలో రాజకీయ దురుద్దేశం లేదని పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ తెలిపారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతోందని, SIT ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చన్నారు. గత CM, మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్ లేదని చెప్పారు. పూర్తి విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని, కేసులో భాగస్వాములు ఎవరో తేలాల్సి ఉందన్నారు.


