News June 10, 2024

వైసీపీ ప్రభుత్వ బాధితులను ఆహ్వానించిన కొత్త ప్రభుత్వం

image

AP: సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి గత వైసీపీ సర్కారు బాధితులను కొత్త ప్రభుత్వం ఆహ్వానించింది. వీరి కోసం ప్రత్యేక గ్యాలరీని సైతం ఏర్పాటు చేశారు. ఆహ్వానం అందిన వారిలో అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణం కుటుంబం సహా మొత్తం 104 కుటుంబాలు ఉన్నాయి. కాగా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Similar News

News March 25, 2025

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అవసరం లేదనిపించింది: ధోనీ

image

IPLలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రూల్‌ను ప్రకటించినప్పుడు అవసరం లేదని అనిపించింది. టోర్నీ మంచి పొజిషన్‌లోనే ఉంది. TRP కూడా బాగుంది. అలాంటప్పుడు ఇంకా మసాలా యాడ్ చేయడమెందుకు అని అనుకున్నా. ప్రస్తుతం ఈ రూల్ నాకు హెల్ప్ అవ్వదు. ఎందుకంటే నేను బ్యాటింగ్‌, కీపింగ్ రెండూ చేస్తున్నా. టోర్నీలో హైస్కోర్లు నమోదవడానికి పిచ్ పరిస్థితులే కారణం. ఈ రూల్ కాదు’ అని పేర్కొన్నారు.

News March 25, 2025

నేను క్షమాపణ చెప్పను: కునాల్ కమ్రా

image

మహారాష్ట్ర Dy.CM ఏక్‌నాథ్ షిండేపై తాను చేసిన వ్యాఖ్యలను కమెడియన్ <<15868229>>కునాల్ కమ్రా<<>> సమర్థించుకున్నారు. క్షమాపణలు చెప్పబోనని ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భావ వ్యక్తీకరణ హక్కు అనేది శక్తివంతమైన వారిని ప్రశంసించడానికి మాత్రమే కాదు. రాజకీయ నేతలపై వ్యంగ్యంగా మాట్లాడడం చట్టవిరుద్ధం కాదు. షిండే గురించి అజిత్ పవార్ ఏం అన్నారో అదే నేనూ చెప్పాను. అయినా పోలీసులు, కోర్టుకు సహకరిస్తాను’ అని పేర్కొన్నారు.

News March 25, 2025

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. భారత్‌కు షాక్?

image

US అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వెనెజువెలా నుంచి చమురును కొనే దేశాలు ఇకపై తమతో చేసే ఏ వాణిజ్యంలోనైనా 25శాతం అదనపు సుంకం కట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆ దేశం అమెరికాకు శత్రుత్వం పాటిస్తోందని వివరించారు. వెనెజువెలా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం భారత్‌కు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది.

error: Content is protected !!