News May 12, 2024
ఓల్డెస్ట్ మహిళా బిలియనీర్ సుబ్బమ్మ జాస్తి!

సువెన్ ఫార్మా కోఫౌండర్ వెంకటేశ్వర్లు జాస్తి తల్లి సుబ్బమ్మ(91) ఇండియాలో ఓల్డెస్ట్ మహిళా బిలియనీర్గా అవతరించారు. ఆమె ఆస్తి 1.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. HYDకు చెందిన ఈమె కుమారుడు వెంకటేశ్వర్లు 1970-80 మధ్య USలో 6 ఫార్మసీలను నడిపేవారు. 1989లో సువెన్ ఫార్మాను ప్రారంభించారు. గత ఏడాది FEBలో అతని తండ్రి సుబ్బారావు చనిపోవడంతో తల్లికి ఆస్తిలో వాటా లభించింది.
Similar News
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<
News March 5, 2026
రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.
News March 5, 2026
‘ఇండియా అతిథి’ని ముంచేశారు.. USకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్

శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై ఇరాన్ మండిపడింది. ‘ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి పాల్పడింది. 130 మంది నావికులతో కూడిన ఫ్రిగేట్ దేనా.. ఇండియన్ నేవీకి అతిథి. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నౌకను ముంచేశారు. నా మాటలను గుర్తుంచుకోండి. అమెరికా <<19299071>>చేసిన పనికి<<>> తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన టైం వస్తుంది’ అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చీ హెచ్చరించారు.


