News March 11, 2025

ఇక దూకుడే.. ప్రభుత్వంపై పోరాటమే: KCR

image

TG: BRS శాసనసభాపక్ష సమావేశంలో MLAలు, MLCలకు KCR దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. ‘ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలి. రైతు సమస్యలు, మంచినీటి కొరతపై సభలో గళం విప్పాలి. BC, SC రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి. గురుకుల స్కూళ్లు, ఉద్యోగ సమస్యలు, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి’ అని KCR సూచించారు.

Similar News

News October 27, 2025

నెల్లూరు SP కార్యాలయం నుంచి కీలక అప్డేట్.!

image

ప్రతి సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు నెల్లూరు SP అజిత తెలిపారు. మోంతా తుఫాన్ కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బాదితులు ఎవ్వరూ జిల్లా కేంద్రానికి రావొద్దని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

News October 27, 2025

TODAY HEADLINES

image

* విశాఖకు 790km, కాకినాడకు 780km దూరంలో మొంథా తుఫాన్
* తుఫానుతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు: CM CBN
* భారీ వర్షాలు.. APలో 20 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
* ఈనెల 30 నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో CM రేవంత్
* ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు: పొంగులేటి
* TGలో NOV 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్‌: ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య

News October 27, 2025

రేషన్‌ షాపుల్లో 20% అధిక నిల్వలు: మనోహర్

image

AP: తుఫాను నేపథ్యంలో MLS(మండల స్థాయి స్టాక్ కేంద్రాలు), రేషన్‌ షాపుల్లో 20% అధిక నిల్వలు ఉంచినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. తీరప్రాంత జిల్లాల్లో 40% వరకు సరకు తరలింపు పూర్తయిందన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలులో రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. 50 వేల టార్పాలిన్లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచామని చెప్పారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లోని టార్పాలిన్లను రైతులు వాడుకోవచ్చని స్పష్టం చేశారు.