News August 3, 2024

లక్ష్యసేన్‌తో పోరాడిన ప్లేయర్‌కు క్యాన్సర్.. కానీ!

image

పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్‌ చేతిలో ఓడిన చైనా ఆటగాడు చౌ టియెన్ చెన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కొలొరెక్టల్ క్యాన్సర్‌కు ఆయన గతేడాది చికిత్స తీసుకున్నారు. కానీ ఈ విషయాన్ని టియెన్ ఎక్కడా బయటపెట్టలేదు. శరీరం అంతగా సహకరించపోయినా ఆయన ఒలింపిక్స్ బరిలో నిలిచారు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News December 17, 2025

సంక్రాంతికి మరో 16 స్పెషల్ ట్రైన్స్

image

సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారి కోసం దక్షిణమధ్య రైల్వే సర్వీసులు పెంచుతోంది. తాజాగా మరో 16 ట్రైన్స్ అనౌన్స్ చేసింది. సికింద్రాబాద్-శ్రీకాకుళం, వికారాబాద్-శ్రీకాకుళం, శ్రీకాకుళం-సికింద్రాబాద్ మార్గాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 9 నుంచి 18 మధ్య ఈ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు ద.మ. రైల్వే తెలిపింది. రైళ్ల పూర్తి సమాచారం కోసం ఇమేజ్ స్లైడ్ చేయండి.

News December 17, 2025

ఆముదంతో చర్మం, గోళ్ల సంరక్షణ

image

చర్మం ముడతలు పడకుండా చేసే గుణాలు ఆముదంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘చమురు రాసుకుని స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది. ఆముదంతో రోజూ 10ని. గోళ్లకు మర్దన చేసుకుంటే అవి దృఢంగా మారి విరగకుండా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు, నిద్ర లేచాక చమురు రాసుకుంటే పెదవులు కోమలంగా ఉంటాయి’ అని చెబుతున్నారు. అయితే గర్భిణులు, పాలిచ్చే తల్లులు దీనికి దూరంగా ఉంటే మంచిందంటున్నారు.

News December 17, 2025

జనవరి 1న ‘భారత్ టాక్సీ’ ప్రారంభం

image

ప్రయాణికులకు, డ్రైవర్లకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ యాప్‌ను జనవరి 1 నుంచి ప్రారంభించనుంది. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా దీనిని తీసుకొస్తోంది. తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో ఇందులో అధిక ఛార్జీలు ఉండవు. ఇప్పటికే 56 వేల మందికిపైగా డ్రైవర్లు రిజిస్టర్‌ చేసుకున్నట్లు సమాచారం.