News August 30, 2024
నాలుగోసారి కూడా అధికారం మాదే: మోదీ

రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినా 2029లో కూడా గెలిచి నాలుగోసారి అధికారంలోకి వస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఆయన మాట్లాడుతూ కొందరు రాజకీయ విశ్లేషకులు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మోజారిటీ సాధించలేదని, దాంతో తాను ప్రజాదరణ కోల్పోయానని చెబుతున్నారని అన్నారు. 2029లో జరిగే ఫిన్టెక్ ఫెస్ట్కు కూడా తానే వస్తానని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News January 23, 2026
‘బంగ్లాదేశ్ కథ ముగిసినట్లే’.. నిరాశలో క్రికెటర్లు

T20 WC నుంచి BAN వైదొలగడంపై ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. T20 కెప్టెన్ లిటన్ దాస్, టెస్ట్ కెప్టెన్ షాంటో టోర్నీలో ఆడేందుకు సిద్ధమని చెప్పినా, వారి మాటకు విలువ ఇవ్వలేదని సమాచారం. ‘బంగ్లా క్రికెట్ ముగిసినట్లే’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News January 23, 2026
VHP నేతపై దాడి.. ఉజ్జయినిలో చెలరేగిన హింస

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో హింస చెలరేగింది. విశ్వహిందూ పరిషత్కు చెందిన నాయకుడిపై దాడి జరిగిన నేపథ్యంలో అల్లర్లు చెలరేగినట్టు తెలుస్తోంది. పలు బస్సులకు నిప్పుపెట్టిన అల్లరిమూకలు ఇళ్లపై రాళ్లతో దాడి చేశాయి. దీంతో ఉజ్జయినిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.
News January 23, 2026
తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ

తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కొత్త సర్కార్ లోడింగ్ అని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో డీఎంకేకు కౌంట్డౌన్ మొదలైందని చెప్పారు. DMK ప్రభుత్వం CMC (కరప్షన్, మాఫియా, క్రైమ్) సర్కారుగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఆ పార్టీ విస్మరించిందని ఆరోపించారు. వికసిత్ భారత్ ప్రయాణంలో తమిళనాడు పాత్ర కీలకమని చెన్నైలో నిర్వహించిన సభలో మోదీ స్పష్టం చేశారు.


