News August 30, 2024
నాలుగోసారి కూడా అధికారం మాదే: మోదీ

రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినా 2029లో కూడా గెలిచి నాలుగోసారి అధికారంలోకి వస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఆయన మాట్లాడుతూ కొందరు రాజకీయ విశ్లేషకులు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మోజారిటీ సాధించలేదని, దాంతో తాను ప్రజాదరణ కోల్పోయానని చెబుతున్నారని అన్నారు. 2029లో జరిగే ఫిన్టెక్ ఫెస్ట్కు కూడా తానే వస్తానని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News February 8, 2025
BPL-2025 విజేత ఫార్చూన్ బారిషల్

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఫైనల్లో చిట్టగాంగ్ కింగ్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత చిట్టగాంగ్ 194/3 స్కోర్ చేయగా బారిషల్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టుకు వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. విజేతకు రూ.2.50 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. BPLలో మొత్తం ఏడు టీమ్లు పాల్గొన్న విషయం తెలిసిందే.
News February 8, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 8, 2025
‘స్కిల్ ఇండియా’కు రూ.8,800 కోట్లు

దేశంలోని యువతకు నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రారంభించిన ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని 2026 వరకు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. రూ.8,800 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఇందులో పీఎం కౌశల్ వికాస్ యోజన 4.O, జన్ శిక్షణ్ సంస్థాన్, PM-NAPS పథకాలను భాగం చేసింది. అలాగే జాతీయ సఫారీ కర్మచారి కమిషన్ పదవీ కాలాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించింది.