News March 30, 2024
పెరగనున్న స్మార్ట్ టీవీల ధరలు!
స్మార్ట్ టీవీల ధరలు ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్ ధరలు పెరగడంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని కౌంటర్పాయింట్స్ ఐవోటీ సర్వీస్ వెల్లడించింది. అయితే ప్రీమియం మోడల్స్కు దేశంలో డిమాండ్ ఉండడంతో స్మార్ట్టీవీ దిగుమతులు 9శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆఫ్లైన్తో పోలిస్తే ఆన్లైన్లో టీవీల విక్రయాలు దూసుకుపోతున్నాయి.
Similar News
News January 19, 2025
గజగజ.. 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో కనిష్ఠంగా 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జనవరి 24/25 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
News January 19, 2025
kg చికెన్ ధర ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. HYDలో కేజీ స్కిన్ లెస్ ధర రూ.220-230గా ఉంది. అటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో రూ.240 వరకు ఉంది. లైవ్ బర్డ్ కేజీ రేటు రూ.117గా కొనసాగుతోంది. 12 కోడిగుడ్ల రిటైల్ ధర రూ.70గా ఉంది.
News January 19, 2025
WK ఎంపికపై గంభీర్, రోహిత్ మధ్య డిబేట్?
ఛాంపియన్స్ ట్రోఫీ <<15185531>>జట్టు<<>> ఎంపిక సమయంలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్ను వైస్ కెప్టెన్ చేయాలని, సెకండ్ వికెట్ కీపర్గా శాంసన్ను తీసుకోవాలని గంభీర్ సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కానీ VCగా గిల్, WKగా పంత్ను తీసుకోవడానికే చీఫ్ సెలక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మొగ్గు చూపినట్లు తెలిపింది.