News August 28, 2024

‘స్పాట్’ బాధ్యతలు మళ్లీ కాలేజీలకే

image

TG: కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్ల భర్తీ బాధ్యతలను మరోసారి కాలేజీల యాజమాన్యాలకే విద్యాశాఖ అప్పగించింది. స్పాట్ కౌన్సెలింగ్ కోసం ఇవాళ కాలేజీలు ఖాళీల వివరాలను వెల్లడించనున్నాయి. ప్రవేశాల కోసం రేపు వివరాలతో పత్రిక ప్రకటన జారీ చేస్తాయి. 30 నుంచి SEP 2 వరకు స్పాట్ ప్రవేశాలు జరగనున్నాయి. 19 ప్రభుత్వ కాలేజీల్లో 1,600 సీట్లు మిగలగా తొలిసారిగా వాటి భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

Similar News

News December 12, 2025

నకిలీ కాఫ్ సిరప్ తయారీ.. ED సోదాలు

image

అక్రమ కాఫ్ సిరప్ తయారీ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదు కావడంతో ED సోదాలు చేస్తోంది. నిందితుడు శుభమ్ జైస్వాల్, అనుచరులు అలోక్ సింగ్, అమిత్ సింగ్ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తోంది. యూపీ, ఝార్ఖండ్, గుజరాత్‌లోని 25 ప్రాంతాల్లో ఉదయం 7:30 గంటల నుంచి ఏకకాలంలో దాడులు చేస్తోంది. యూఏఈలో తలదాచుకుంటున్న జైస్వాల్‌ను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

News December 12, 2025

జపాన్‌లో మళ్లీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

image

జపాన్‌లో వరుస <<18509568>>భూకంపాలు<<>> ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇవాళ 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర పసిఫిక్ తీరప్రాంతంలో సునామీ అలలు మీటర్ ఎత్తులో ఎగసిపడొచ్చని హెచ్చరించారు. కుజి నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. కాగా నాలుగు రోజుల కిందట ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపానికి పలు ఇళ్లు బీటలు వారగా 50 మంది గాయపడ్డారు.

News December 12, 2025

బస్సు ప్రమాదంపై PM దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

image

AP: అల్లూరి జిల్లా బస్సు <<18539495>>ప్రమాదంలో<<>> ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాగా ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.