News August 28, 2024
‘స్పాట్’ బాధ్యతలు మళ్లీ కాలేజీలకే

TG: కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్ల భర్తీ బాధ్యతలను మరోసారి కాలేజీల యాజమాన్యాలకే విద్యాశాఖ అప్పగించింది. స్పాట్ కౌన్సెలింగ్ కోసం ఇవాళ కాలేజీలు ఖాళీల వివరాలను వెల్లడించనున్నాయి. ప్రవేశాల కోసం రేపు వివరాలతో పత్రిక ప్రకటన జారీ చేస్తాయి. 30 నుంచి SEP 2 వరకు స్పాట్ ప్రవేశాలు జరగనున్నాయి. 19 ప్రభుత్వ కాలేజీల్లో 1,600 సీట్లు మిగలగా తొలిసారిగా వాటి భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Similar News
News December 4, 2025
SIDBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News December 4, 2025
నేడు ఇలా చేస్తే.. సిరి సంపదలకు లోటుండదు: పండితులు

నేడు మార్గశిర పౌర్ణమి, గురువారం కలిసి వచ్చిన అత్యంత పవిత్రమైన రోజు. ఈ శుభ దినాన కొన్ని పూజలు, పనులు చేయడం వల్ల సిరిసంపదలకు లోటుండదని పండితులు అంటున్నారు. పేదలకు అన్నదానం, దాన ధర్మాలు చేస్తే మానసిక ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతాయంటున్నారు. ‘సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినా, విన్నా కూడా శుభం కలుగుతుంది. దీపారాధన చేయవచ్చు. ఇష్టదైవానికి శనగలు నైవేద్యంగా సమర్పించాలి’ అని సూచిస్తున్నారు.
News December 4, 2025
S-500 గురించి తెలుసా?

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ ‘ఆపరేషన్ సిందూర్’లో గేమ్ ఛేంజర్గా మారింది. దీంతో దాని కంటే శక్తిమంతమైన S-500ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. S-400 సిస్టమ్ 400కి.మీ దూరంలోని టార్గెట్లను మాత్రమే షూట్ చేయగలదు. కానీ S-500 రేంజ్ 600 కి.మీ కావడం విశేషం. హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, లో ఆర్బిట్ శాటిలైట్లను నాశనం చేయగలదు. ఒక్క యూనిట్ ధర సుమారు రూ.20,800కోట్ల వరకు ఉంటుంది.


