News April 25, 2024

రూ.3.99 కోట్ల కారు 325కి.మీ స్పీడ్‌తో వెళ్తుంది

image

బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ ‘వాంటేజ్’ పేరుతో కొత్త మోడల్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. దీని ధరను రూ.3.99 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ మోడల్ టాప్ స్పీడ్ గంటకు 325కి.మీ కాగా.. 0-96కి.మీ వేగాన్ని కేవలం 3.4 సెకన్లలోనే ఈ కారు అందుకుంటుందని సంస్థ వెల్లడించింది. ఇందులో వెట్, స్పోర్ట్, స్పోర్ట్స్ ప్లస్, ట్రాక్, ఇండివిడ్యువల్ డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి.

Similar News

News October 21, 2025

రోహిత్, జైస్వాల్, అభిషేక్.. గిల్‌కి జోడీ ఎవరు?

image

మరో రెండేళ్ల(2027)లో మెన్స్ వన్డే CWC రానుంది. ఇప్పటి నుంచే ఆ టోర్నీలో ఓపెనింగ్ జోడీపై SMలో చర్చ మొదలైంది. T20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేలకే పరిమితమయ్యారు. అప్పటివరకు ఆయన కొనసాగుతారా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. అయితే జైస్వాల్-గిల్ జోడీ అయితే బెటరని కొందరు, అభిషేక్-గిల్ అని మరికొందరు, రోహిత్-గిల్ బెస్ట్ అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఏ జోడీ అయితే బెటర్? COMMENT

News October 21, 2025

పని ప్రదేశాల్లో వేధింపులకు చెక్ పెట్టే షీ బాక్స్

image

పనిప్రదేశాల్లో మహిళలపై వేధింపులను నిరోధించేందుకు షీబాక్స్ పేరిట కేంద్రం ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. పనిప్రదేశాల్లో వేదింపులు ఎదుర్కొన్న మహిళలు షీబాక్స్ వెబ్‌సైట్లో ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీతో ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. అది అందిన వెంటనే సంబందిత విచారణ విభాగానికి బదిలీ అవుతుంది. బాధిత మహిళల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతారు. వెబ్‌సైట్:<>https://shebax.wcd.gov.in/<<>>

News October 21, 2025

బీజేపీ-ఆప్ మధ్య ‘పొల్యూషన్’ పంచాయితీ

image

ఢిల్లీలో పొల్యూషన్ సమస్య బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దీపావళి వేళ కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆప్ రాష్ట్రాధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దీంతో ఆ పార్టీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో పంటల కాల్చివేత వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడింది. పొల్యూషన్‌కు దీపావళిని బ్లేమ్ చేయొద్దని హితవు పలికింది.