News December 18, 2024
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 63,598 మంది దర్శించుకున్నారు. వీరిలో శ్రీవారికి 20,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు వచ్చినట్లు TTD ప్రకటించింది.
Similar News
News January 30, 2026
OTTలోకి ‘నారీ నారీ నడుమ మురారి’

సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలతో పోటీ పడి హిట్ టాక్ తెచ్చుకున్న శర్వానంద్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ OTTలోకి వచ్చేస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.
News January 30, 2026
ఉద్యోగులు SM అకౌంట్ తెరవాలంటే అనుమతి తప్పనిసరి!

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వాడకంపై బిహార్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగులెవరైనా SM ఖాతాను తెరవడానికి అధికారుల అనుమతి తప్పనిసరి. వీటికి అధికారిక ఈమెయిల్, ప్రభుత్వ నంబర్లను వాడరాదు. వారి హోదా, ప్రభుత్వ లోగోను SM పోస్టులలో ఉపయోగించరాదు. నకిలీ ఖాతాలను వాడితే చర్యలు తప్పవు. డిజిటల్ స్పేస్లో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News January 30, 2026
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


