News February 10, 2025
కార్పొరేషన్ ఛైర్మన్ జీతభత్యం రూ.2.77 లక్షలు

AP: కార్పొరేషన్లు, బోర్డుల ఛైర్మన్లకు జీతభత్యాలు నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కేటగిరీ-A కింద ఛైర్మన్కు నెలకు మొత్తం రూ.2.77 లక్షలు ఇవ్వనుంది. ఇందులో జీతం రూ.1.25 లక్షలు, వాహన అలవెన్సు రూ.60వేలు, ఇంటి అద్దెకు రూ.40వేలు, పీఏల జీతాలు, మెడికల్ రీయింబర్స్మెంట్కు రూ.52వేలు చెల్లించనుంది. కేటగిరీ-B కార్పొరేషన్ ఛైర్మన్కు మొత్తం రూ.1.93 లక్షలు ఇవ్వనుంది.
Similar News
News March 21, 2025
ఎంఎస్ ధోనీ అన్ని సీజన్ల స్కోర్లు ఇవే

భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ IPL తొలి సీజన్ నుంచి ఆడుతున్నారు. ఇప్పటికీ తన ఆటతీరుతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 43 ఏళ్ల వయసులో IPL 2025లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ధోనీ అన్ని సీజన్ల స్కోర్లు ఇలా ఉన్నాయి. 2008-414, 2009-332, 2010-287, 2011-392, 2012-358, 2013-461, 2014-371, 2015-372, 2016-284, 2017-290, 2018-455, 2019-416, 2020-200, 2021-114, 2022-232, 2023-104, 2024లో 161 రన్స్ చేశారు.
News March 21, 2025
‘కోర్టు’ నటుడితో దిల్ రాజు మూవీ?

‘కోర్టు: స్టేట్vsనోబడీ’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు హర్ష్ రోషన్తో దిల్ రాజు సినిమా తీయనున్నట్లు సమాచారం. దీనికి ‘తెల్ల కాగితం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రమేశ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తారని టాలీవుడ్ టాక్. ఇందులో శివాజీ కీలక పాత్ర పోషిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా చిన్న బడ్జెట్తో తెరకెక్కిన కోర్టు మూవీ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
News March 20, 2025
ఫోన్ పే, గూగుల్ పే ఉపయోగిస్తున్నారా?

ఏప్రిల్ 1 నుంచి NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త మార్గదర్శకాలు అమలు చేయనుంది. ఈ రూల్స్ ప్రకారం డియాక్టివేట్, సరెండర్ చేసిన మొబైల్ నంబర్లను ఈ నెల 31లోగా తొలగించాలని బ్యాంకులను ఆదేశించింది. ఆ తర్వాత ఈ నంబర్లను ఉపయోగించి ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు పొందలేరని తెలిపింది. అప్డేట్ చేసిన మొబైల్ నంబర్ సిస్టమ్ను ఉపయోగించి ట్రాన్సాక్షన్ల సంఖ్యను పేర్కొనాలని సూచించింది.