News August 21, 2024
పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు

TG: పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచురించనుంది. ఓటరు జాబితాపై SEP 7 నుంచి 13 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. 9, 10న రాజకీయ పార్టీల సూచనలు స్వీకరించనుంది. అదే నెల 21న వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను ప్రచురించనుంది. కాగా ఓటరు జాబితా తయారీపై ఈ నెల 29న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
Similar News
News July 8, 2025
నేను బాగున్న.. దేశం కోసం పోరాడు: ఆకాశ్ సోదరి

తన సోదరి క్యాన్సర్తో బాధపడుతున్నారని భారత ప్లేయర్ ఆకాశ్ దీప్ <<16971842>>ఎమోషనల్ <<>>అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన సోదరి మీడియాతో మాట్లాడారు. ‘నేను బాగున్నానని, దేశానికి మంచి చేయడంపై దృష్టి పెట్టాలని ఇంగ్లండ్కు వెళ్లేముందు ఆకాశ్తో చెప్పా. ఆకాశ్ నా గురించి బహిరంగంగా మాట్లాడతారని నాకు తెలియదు. మేము దీన్ని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ అతను ఎమోషనలై ఈ విషయాన్ని చెప్పాడు’ అని తెలిపారు.
News July 8, 2025
ప్రజాస్వామికంగా చర్చలు జరపాలి: పొన్నం

TG: పదేళ్లు అధికారంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక గతంలోని పథకాలను కొనసాగిస్తూ అదనపు పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. చర్చలు ప్రజాస్వామికంగా ఉంటూ ప్రజలకు తెలియాలని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేయట్లేదని, స్పీకర్కు లేఖ రాసి <<16988692>>చర్చకు<<>> రావాలన్నారు. చర్చ జరిగితే ఎవరేంటో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు.
News July 8, 2025
లండన్లో విరాట్ కోహ్లీ ఇల్లు ఎక్కడంటే?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్లోని ఓ ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. లండన్లోని నాటింగ్ హిల్ ఏరియాలో ఉన్న సెయింట్ జాన్స్ వుడ్లో ఆయన ఇల్లు ఉన్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ తెలిపారు. స్టార్ స్పోర్ట్స్లో చర్చ సందర్భంగా ట్రాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి లండన్లో స్థిరపడతారని కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.