News April 24, 2024
రెండో దశ ఎన్నికలు.. స్వల్పంగా పెరిగిన మహిళా అభ్యర్థులు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ఈ నెల 26న జరగనుంది. 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశతో పోలిస్తే సెకండ్ ఫేజ్లో పోటీ చేసే మహిళా అభ్యర్థులు కాస్త పెరిగారు. తొలి దశలో 102 స్థానాలకు 1,625 మంది పోటీ చేయగా 134(8.2%) మంది మహిళలున్నారు. ఈసారి 1198 మంది బరిలో ఉండగా వీరిలో 103(8.6%) మంది మహిళలు పోటీలో నిలిచారు.<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News March 3, 2026
IIT బెనారస్లో ఉద్యోగాలు

<
News March 3, 2026
ఇరాన్లో భూకంపం.. అణుకేంద్రాల దగ్గర అలజడి

ఇరాన్లోని గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10km లోతులో చోటుచేసుకున్న ఈ ప్రకంపనలు సహజసిద్ధమైనవేనని USGS తెలిపింది. అయితే అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ భూకంపం రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. గెరాష్కు సమీపంలో ఉన్న బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం, గ్చైన్ యురేనియం గనులకు ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. యుద్ధం మధ్యలో ఈ భూకంపం భయాందోళనలను రేకెత్తించింది.
News March 3, 2026
అభివృద్ధి చెందాం.. కానీ, శాంతిని మర్చిపోయాం!

టెక్నాలజీ పెరిగింది. నాగరికత శిఖరాగ్రానికి చేరింది. దౌత్యం గొప్పతనాన్ని చరిత్ర చాటిచెప్పింది. మనం సృష్టించిన ఆయుధాలు మనల్నే మింగేసేంత శక్తిమంతమైనవని తెలిసినా.. రక్తపాతాలు ఆగడం లేదు. నాయకుల ఈగోలు, ఆధిపత్య పోరాటాలు మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దేశాల ఉనికిని కాపాడాల్సింది పోయి, యుద్ధాలతో వినాశనాన్ని కొనితెచ్చుకోవడం విషాదం. హింసను ఆపి మనిషిని ప్రేమించే స్పృహ పెరగాల్సిన సమయం ఇది.


