News July 17, 2024
గ్రాడ్యుయేట్లకు ప్రతి నెలా రూ.10వేల భత్యం ప్రకటించిన షిండే ప్రభుత్వం

మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా 12వ తరగతి పాసైన విద్యార్థులకు ప్రతి నెలా రూ.6000, డిప్లొమా చేసిన వారికి రూ.8వేలు, గ్రాడ్యుయేట్స్కు రూ.10వేల భత్యం ఇవ్వనున్నట్లు షిండే ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు ఉపాధిని మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా ఏడాది పాటు ఈ భత్యం చెల్లించనున్నారు. కాగా రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News November 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 80

ఈరోజు ప్రశ్న: ఉప పాండవులను చంపింది ఎవరు? ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 28, 2025
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News November 28, 2025
నేషనల్ ఫొరెన్సిక్ సైన్సెస్ వర్సిటీలో ఉద్యోగాలు

<


