News December 19, 2024
కొత్త రెవెన్యూ చట్టం ప్రకారమే భూ సమస్యలకు పరిష్కారం

TG: ప్రభుత్వం త్వరలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానుందని, అప్పటివరకూ భూ సంబంధించిన ఆర్డర్లు జారీ చేయవద్దని జిల్లా కలెక్టర్లను భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశించారు. కొత్త చట్టం ప్రకారమే భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. తదుపరి ఆదేశాలను జారీ చేసే వరకూ ఎలాంటి ఆర్డర్లు ఇవ్వొద్దని, ఒకవేళ ఎవరైనా ఇచ్చినా అవి చెల్లుబాటు కావని స్పష్టం చేశారు.
Similar News
News November 11, 2025
రూ.6.65 లక్షల కోట్లకు ఇళ్ల అమ్మకాలు: అనరాక్

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గినా వాల్యూ పరంగా మాత్రం సగటు అమ్మకం విలువ 7% పెరిగిందని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. ప్రస్తుత FYలో తొలి ఆరు నెలల్లో రూ.2.98 లక్షల కోట్ల విలువైన 1.93 లక్షల ఇళ్లు అమ్ముడైనట్లు తెలిపింది. ఇదే జోరులో మార్చి ముగిసే సమయానికి అమ్మకాల విలువ రూ.6.65 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. HYDలో ఇళ్ల మార్కెట్ జోరుగా ఉందని బిల్డర్లు చెబుతున్నారు.
News November 11, 2025
ఇతరులు మనల్ని బాధ పెట్టకూడదంటే?

త్రివిధ తాపాల్లో రెండవది ఆది భౌతిక తాపం. ఇవి మన చుట్టూ ఉన్న ఇతర జీవుల వలన కలుగుతుంది. శత్రువులు, దొంగలు, జంతువులు, కీటకాల నుంచి మనకు కలిగే బాధలు ఈ కోవకు చెందుతాయి. వీటి నుంచి విముక్తి పొందే మార్గాలను వేదాలు చెబుతున్నాయి. ప్రేమ, కరుణ, జీవుల పట్ల సమభావం ఉండాలి. అహింసా సిద్ధాంతాన్ని ఆచరించడం, పరుల పట్ల శత్రుత్వాన్ని విడిచిపెట్టడం, అందరితో సామరస్యంగా జీవించడం ద్వారా ఈ బాహ్య దుఃఖాలను తగ్గించుకోవచ్చు.
News November 11, 2025
రాజమౌళి సర్ప్రైజ్లతో మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ

మహేశ్ బాబు ఫ్యాన్స్ను రాజమౌళి వరుస సర్ప్రైజ్లతో ముంచెత్తుతున్నారు. ఈ నెలలో SSMB29 నుంచి కేవలం టైటిల్ గ్లింప్స్, లుక్ రిలీజ్ చేస్తారని భావించారు. అయితే అంచనాలకు భిన్నంగా పృథ్వీరాజ్ లుక్, ఓ <<18251735>>సాంగ్<<>>ను రిలీజ్ చేశారు. త్వరలో ప్రియాంక లుక్ రివీల్ చేస్తారని తెలుస్తోంది. అటు ఈ నెల 15న టైటిల్తో పాటు 3 నిమిషాల గ్లింప్స్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అప్డేట్లతో మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


