News August 28, 2024
రాష్ట్రం జ్వరాంధ్రప్రదేశ్గా మారింది.. చర్యలేవీ?: షర్మిల

AP: రాష్ట్రాన్ని విష జ్వరాలు వణికిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని APCC చీఫ్ షర్మిల విమర్శించారు. ‘రాష్ట్రం జ్వరాంధ్రప్రదేశ్గా మారింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురికి చికిత్స అందిస్తున్న దుస్థితి ఉంది. గత సర్కారును తిడుతూ ఐదేళ్లు కాలయాపన చేస్తారా? వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. పరిస్థితి అందుబాటులో వచ్చే వరకు సీఎం నేరుగా పర్యవేక్షించాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 23, 2026
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఉద్యోగాలు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (<
News January 23, 2026
ట్రంప్ కంటే మోదీ పవర్ఫుల్: ఇయాన్ బ్రెమ్మర్

US అధ్యక్షుడు ట్రంప్ కంటే మన PM మోదీయే చాలా పవర్ఫుల్ అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ పదవి మరో మూడేళ్లలో పోతుందని.. కానీ మోదీకి దేశంలో తిరుగులేని మద్దతు ఉందని పేర్కొన్నారు. దీంతో మోదీ సంస్కరణలను దూకుడుగా అమలు చేయగలరని, విదేశీ ఒత్తిడి వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలరని విశ్లేషించారు. ట్రంప్ కంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా బెటర్ పొజిషన్లో ఉన్నట్లు తెలిపారు.
News January 23, 2026
ఇంటర్నేషనల్ క్రికెట్లో పదేళ్లు.. బుమ్రా మ్యాజిక్ ఇదే!

బుల్లెట్ల లాంటి యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే భారత స్టార్ బౌలర్ బుమ్రా ఇంటర్నేషనల్ క్రికెట్లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. తన డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ వల్ల ఎక్కువ రోజులు ఆడలేరన్న విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ పదేళ్లలో టెస్టుల్లో 234, వన్డేల్లో 149, T20ల్లో 103W తీశారు. 2024లో ICC క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా నిలిచారు. రానున్న T20 WCలో IND బౌలింగ్ దళాన్ని బుమ్రానే నడిపించనున్నారు.


