News August 28, 2024
రాష్ట్రం జ్వరాంధ్రప్రదేశ్గా మారింది.. చర్యలేవీ?: షర్మిల

AP: రాష్ట్రాన్ని విష జ్వరాలు వణికిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని APCC చీఫ్ షర్మిల విమర్శించారు. ‘రాష్ట్రం జ్వరాంధ్రప్రదేశ్గా మారింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురికి చికిత్స అందిస్తున్న దుస్థితి ఉంది. గత సర్కారును తిడుతూ ఐదేళ్లు కాలయాపన చేస్తారా? వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. పరిస్థితి అందుబాటులో వచ్చే వరకు సీఎం నేరుగా పర్యవేక్షించాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 26, 2025
న్యూ ఇయర్ బెస్ట్ రెజల్యూషన్స్.. ట్రై చేసి చూడండి

*రోజుకు కొంత మొత్తాన్ని సేవ్ చేయండి. భవిష్యత్లో ఇదే పెద్ద అమౌంట్గా మారి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ లాంటివి ట్రై చేయవచ్చు.
*రోజుకు 8వేల-10వేల అడుగుల దూరం నడవండి. పొద్దున్నే ఓ గ్లాస్ వేడి నీరు తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు
*పెయింటింగ్, ఏఐ, రైటింగ్, డాన్స్, సింగింగ్ ఇలా ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి.
News December 26, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో ఉద్యోగాలు.. అప్లైకి 3 రోజులే సమయం

<
News December 26, 2025
కూరగాయల పంటకు తెగుళ్ల నుంచి సహజ రక్షణ

పొలం చుట్టూ, గట్ల వెంబడి ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే పొలం చుట్టూ గట్ల వెంబడి, నాటుకు కనీసం రెండు వారాల ముందు 3-4 వరుసల్లో మొక్కజొన్న పంటను కంచే పంటగా నాటుకోవాలి. దీనివలన ఈ మొక్కలు కూరగాయ పంటకు ప్రహారీలా ఉండి, పక్క పొలాల నుంచి పురుగులు రాకుండా రక్షణ కల్పిస్తాయి. మొక్కజొన్న మొక్కల్లో వచ్చిన కంకులను విక్రయించడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది.


