News April 10, 2025

జగన్ నుంచి రాష్ట్రానికి భద్రత కావాలి: నిమ్మల

image

AP: వైసీపీ చీఫ్ జగన్‌కు మరింత భద్రత కేటాయించాలన్న ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల రామనాయుడు కౌంటర్ ఇచ్చారు. నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎవరికి భద్రత కావాలని ప్రశ్నించారు. భద్రత జగన్‌కు కాదని, ఆయన నుంచి రాష్ట్రానికి, ప్రజలకు కావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు సైతం తన పర్యటనల్లో సెక్యూరిటీని తగ్గించుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు.

Similar News

News March 29, 2026

ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ గురించి తెలుసా?

image

ప్రెగ్నెన్సీలో మహిళలు మద్యం తాగడం వల్ల బిడ్డకు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీంతో శిశువుకు శారీరక, మానసిక లోపాలు ఏర్పడతాయంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకుంటే అది పిండంలోకి సులువుగా చేరుతుంది. కాలేయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆల్కహాల్ శిశువు శరీరంలో పేరుకుపోతుంది. దీంతో శిశువుకు పోషకాలు, ఆక్సిజన్ అందక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.

News March 29, 2026

యుద్ధం.. కండోమ్‌ల కొరత

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కండోమ్‌లపైనా పడింది. వాటి తయారీ కోసం వినియోగించే సిలికాన్ ఆయిల్ (లూబ్రికేషన్ కోసం) లభించట్లేదని HLL లైఫ్ కేర్, మాన్‌కైండ్ ఫార్మా తెలిపాయి. కండోమ్ చిరిగిపోకుండా ఉండేందుకు వాడే అమ్మోనియా ధరలు 40-50% పెరిగాయని పేర్కొన్నాయి. 86% అమ్మోనియాను గల్ఫ్ నుంచే దిగుమతి చేసుకుంటామని, ఇప్పుడు హార్ముజ్ మూసివేతతో ఇబ్బంది కలుగుతోందని వివరించారు. దీంతో కండోమ్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

News March 29, 2026

పాక్‌కు ఊరట.. 20 షిప్పులకు ఇరాన్ పర్మిషన్

image

ఇంధన కొరతతో అల్లాడుతున్న పాకిస్థాన్‌కు ఇరాన్ ఊరటనిచ్చింది. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లేందుకు 20 నౌకలకు పర్మిషన్ ఇచ్చింది. ఇది తమ దౌత్యపరమైన విజయం అని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు. రోజుకు రెండు నౌకలు జలసంధిని దాటుతాయని పేర్కొన్నారు. కాగా పాకిస్థాన్‌లో ఇంధన కొరతతో 11.67 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.5,135 (పాక్ కరెన్సీ)కి పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.