News April 10, 2025

జగన్ నుంచి రాష్ట్రానికి భద్రత కావాలి: నిమ్మల

image

AP: వైసీపీ చీఫ్ జగన్‌కు మరింత భద్రత కేటాయించాలన్న ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల రామనాయుడు కౌంటర్ ఇచ్చారు. నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎవరికి భద్రత కావాలని ప్రశ్నించారు. భద్రత జగన్‌కు కాదని, ఆయన నుంచి రాష్ట్రానికి, ప్రజలకు కావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు సైతం తన పర్యటనల్లో సెక్యూరిటీని తగ్గించుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు.

Similar News

News February 12, 2026

అందుకే BRS అధికారం కోల్పోయింది: కవిత

image

TG: ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం వల్లే BRS అధికారం కోల్పోయిందని కవిత అన్నారు. ‘ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చనందుకే KCR అధికారం కోల్పోయారు. రేవంత్‌ పట్టించుకోకపోతే ఆయననూ ప్రజలు వదిలిపెట్టరు’ అని హెచ్చరించారు. రాజకీయ పార్టీ పెడతానంటే తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ పదం ఉండేలా పార్టీ పెడతానని ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో వ్యాఖ్యానించారు.

News February 12, 2026

తేమ అవసరం.. అతి తేమతో పంటకు ప్రమాదం

image

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘త్రిపురారి’’

image

తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు రాక్షసులు బ్రహ్మ వరం పొంది బంగారం, వెండి, ఇనుముతో కూడిన 3 నగరాలను నిర్మించుకున్నారు. వారు లోకాలను హింసిస్తుండగా, దేవతల ప్రార్థన మన్నించిన శివుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. భూమినే రథంగా, వేదాలను గుర్రాలుగా చేసుకుని, ఒకే బాణంతో ఆ 3 పురాలను భస్మం చేసి రాక్షస సంహారం చేశాడు. ఆ 3 పురాలను(త్రిపుర) అంతం చేసిన శత్రువు(అరి) కాబట్టి ఆయన ‘త్రిపురారి’ అయ్యాడు.