News April 11, 2024

ముగ్గురం మళ్లీ జతకట్టాం.. జగన్ నిలబడగలడా?: CBN

image

AP: చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు CM జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘CM ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సిద్ధం అంటున్న వారిపై యుద్ధం చేద్దామని పవన్ చెప్పారు. 2014లో పవన్ పోటీ చేయకుండా మద్దతిచ్చారు. గోదావరి జిల్లాల ప్రజలు వన్‌సైడ్ తీర్పిచ్చారు. మరోసారి మోదీ, నేను, పవన్ జతకట్టాం. నిలబడే దమ్ము జగన్‌కు ఉందా?మీరు నిలబడనిస్తారా? ఎన్నికలు లాంఛనమే. కూటమి గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News February 5, 2026

పరుచూరి ‘వ్యక్తిత్వ వికాస’ మంత్రం ఇదే!

image

మనిషి వ్యక్తిత్వంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘మాట్లాడేటప్పుడు నోరు, ఆలోచించేటప్పుడు మనసు అదుపులో ఉండాలి. ఇతరులను కలిసినప్పుడు ప్రవర్తన మర్యాదగా ఉండాలి. భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతో భయం లేకుండా ముందడుగు వేయాలి. మనిషి ఎదుగుదలకు క్రమశిక్షణ, సంస్కారం ఎంతో అవసరం’ అని ఆయన పేర్కొన్న తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

News February 5, 2026

బెన్ స్టోక్స్‌కు తీవ్రగాయం!

image

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డారు. బాల్ తగలడంతో తన ముఖానికి గాయమైనట్లు ఇన్‌స్టాలో ఫొటోను షేర్ చేశారు. అందులో కన్ను బాగా వాచిపోవడంతో పాటు పెదవి, ముక్కుకు గాయమైనట్లు కనిపిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో “Get well soon” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News February 5, 2026

పచ్చి పాలతో గర్భిణికి ఇన్ఫెక్షన్.. శిశువు మృతి

image

అమెరికాలో దారుణ ఘటన జరిగింది. గర్భిణీ సమయంలో ఓ మహిళ పచ్చి పాలను తాగేది. అందులోని బాక్టీరియా కారణంగా లిస్టీరియా అనే ఇన్ఫెక్షన్ సోకి నవజాత శిశువు మృతి చెందింది. అన్‌పాశ్చరైజ్డ్/ వేడి చేయని మిల్క్ తాగితే గర్భిణులు, శిశువులు, పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు గర్భస్రావం అవ్వొచ్చని అంటున్నారు. వేడి చేసిన పాలనే తాగాలని సూచిస్తున్నారు.