News July 2, 2024

దేశ ప్రజల ఐక్యత భేష్: మోహన్ భగవత్

image

భారత్‌లో అంతర్గగతంగా విభేదాలున్నప్పటికీ ప్రజలంతా కలిసికట్టుగానే ఉన్నారని ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. శత్రుదేశాలపై మనపై దాడికి యత్నించినప్పుడు వారిలో ఆ ఐక్యత స్పష్టంగా కనిపిస్తుందని కొనియాడారు. భారత సైనికుడు అబ్దుల్ హమీద్ జీవితం ఆధారంగా రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాతృభూమిపై ప్రజలు ఎనలేని ప్రేమ, అభిమానం చూపుతున్నారని చెప్పుకొచ్చారు.

Similar News

News September 20, 2024

నందిగం సురేశ్ ఇంట్లో సోదాలు

image

AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. పోలీసు కస్టడీలో ఆయన వెల్లడించిన సమాచారం ఆధారంగా గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన ఆయనకు కోర్టు తాజాగా మరో 14 రోజులు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే.

News September 20, 2024

లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ: నేడే తొలి మ్యాచ్

image

మాజీ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఇవాళ్టి నుంచి జరగనుంది. నేడు తొలి మ్యాచులో రాత్రి 7 గంటలకు కోణార్క్ సూర్యాస్, మణిపాల్ టైగర్స్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ధవన్, ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ తదితర మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, ఫ్యాన్ కోడ్ యాప్‌లో ఈ మ్యాచులను చూడవచ్చు.

News September 20, 2024

ఆయుధాలు వదిలేసి సరెండర్ కండి: అమిత్ షా

image

నక్సల్స్ హింసను విడనాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలేసి సరెండర్ కావాలని సూచించారు. తన ప్రతిపాదనను పట్టించుకోకపోతే నక్సల్స్‌పై ఆలౌట్ ఆపరేషన్ మొదలుపెడతామని అమిత్ షా హెచ్చరించారు.