News March 9, 2025

అడుగంటిన నీరు.. ఎండుతున్న పైరు

image

వేసవి ఇంకా ముదరకముందే TGలో పంటలు ఎండుతున్నాయి. గతేడాది కృష్ణా, గోదావరిలో సమృద్ధిగా నీరు ఉండటం, ప్రాజెక్టులు సైతం కళకళలాడటం, భూగర్భజలాలు పెరగడంతో అన్నదాతలు వరిసాగు గణనీయంగా పెంచారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితి దిగజారింది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఖాళీ అయ్యాయి. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లు అడుగంటాయి. దీంతో నీరందక పైర్లు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

Similar News

News March 9, 2025

కొత్త అల్లుడు.. గాడిదపై ఊరేగాల్సిందే!

image

హోలీ సందర్భంగా MHలోని ఓ గ్రామం 86 ఏళ్లుగా ఓ వింత ఆచారాన్ని కొనసాగిస్తోంది. బీడ్ జిల్లా విడా గ్రామంలో హోలీ రోజు కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగిస్తారు. సమీప ప్రాంతాల ప్రజలు భారీగా అక్కడికి వచ్చి కొత్త అల్లుడికి బహుమతులు ఇస్తారు. పూర్వం ఆ ఊరి పెద్ద దేశ్‌ముఖ్ ఆనందరావు అల్లుడు హోలీ ఆడటానికి ఒప్పుకోడు. దాంతో అతనికి నచ్చజెప్పి గాడిదపై ఊరేగించి హోలీ నిర్వహించారని, అప్పట్నుంచి ఆ వేడుక ఇక్కడ కొనసాగుతోంది.

News March 9, 2025

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

image

AP: ఎమ్మెల్యే కోటా MLC అభ్యర్థుల పేర్లను టీడీపీ ఖరారు చేసింది. కావలి గ్రీష్మ (ఎస్సీ-మాల), బీద రవిచంద్ర (యాదవ), బీటీ నాయుడు (బోయ)కు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించింది. 5 స్థానాలకు గాను ఇప్పటికే ఒకటి జనసేనకు ఇవ్వగా, మరొకటి బీజేపీకి కేటాయించనుంది. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూతురే కావలి గ్రీష్మ. ఆశావహులు చాలా మందే ఉన్నా ఊహించని నేతలకు టికెట్లు దక్కాయి.

News March 9, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. ప్రైజ్ మనీ ఎంతంటే?

image

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య CT ఫైనల్ జరుగుతోంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ గెలిచిన టీంకు 2.24 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందనుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు లభిస్తాయి. టోర్నీలో పాల్గొన్నందుకు IND, NZ సహా అన్ని టీంలు $125,000, గ్రూప్ స్టేజ్‌లో గెలిచిన టీంలు 34,000 డాలర్లు అందుకుంటాయి. 5, 6 స్థానాల్లో నిలిచిన జట్లకు $350,000, 7,8 స్థానాల్లో నిలిచిన జట్లకు $140,000 లభిస్తాయి.

error: Content is protected !!