News March 9, 2025

అడుగంటిన నీరు.. ఎండుతున్న పైరు

image

వేసవి ఇంకా ముదరకముందే TGలో పంటలు ఎండుతున్నాయి. గతేడాది కృష్ణా, గోదావరిలో సమృద్ధిగా నీరు ఉండటం, ప్రాజెక్టులు సైతం కళకళలాడటం, భూగర్భజలాలు పెరగడంతో అన్నదాతలు వరిసాగు గణనీయంగా పెంచారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితి దిగజారింది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఖాళీ అయ్యాయి. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లు అడుగంటాయి. దీంతో నీరందక పైర్లు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

Similar News

News March 26, 2026

GK: భారతదేశ భౌగోళిక విశేషాలు

image

*అతి పొడవైన నది- గంగా నది
* అతి పెద్ద రాష్ట్రం (వైశాల్యం)- రాజస్థాన్
* అతి పెద్ద రాష్ట్రం (జనాభా)- ఉత్తర్‌ప్రదేశ్
* అతి ఎత్తైన శిఖరం – కాంచనజంగ
* అతి పెద్ద ఎడారి – థార్ ఎడారి (రాజస్థాన్)
* అతి పొడవైన తీరరేఖ గల రాష్ట్రం- గుజరాత్
* అతి ఎత్తైన డ్యామ్ – తెహ్రీ డ్యామ్(ఉత్తరాఖండ్)
* అతి పొడవైన డ్యామ్ – హీరాకుడ్ డ్యామ్ (ఒడిశా)
* సౌత్ఇండియాలో పొడవైన నది- గోదావరి

News March 26, 2026

రాజధాని పేరుతో అమరావతిలో అవినీతి యజ్ఞం: సజ్జల

image

AP: అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అలాగైతే మండలిలోనూ చర్చ పెట్టాలన్నారు. అమరావతిలో CM చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై జగన్‌కు అభ్యంతరం లేదని, అందుకే CBN కంటే ముందే భూమి కొనుక్కొని ఆఫీస్, ఇల్లు కట్టుకున్నట్లు చెప్పారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిని ఆయన వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

News March 26, 2026

అంతరాయం లేకుండా ఇంధన సరఫరా: కేంద్రం

image

దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. అన్ని రిటైల్ ఔట్‌లెట్లకు సరిపడా సప్లై చేస్తున్నట్లు పేర్కొంది. దేశంలోని ప్రతి సిటిజెన్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధన సరఫరాకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, అధికారిక ప్రకటనలు మాత్రమే ఫాలో కావాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో 2 నెలలకు సరిపడా ఆయిల్ ఉందని వెల్లడించింది.