News September 29, 2024
రాత్రి ఆటో ఎక్కిన మహిళా ఏసీపీ.. తర్వాతేమైందంటే..
సుకన్య శర్మ ఆగ్రాలో ఏసీపీగా పనిచేస్తున్నారు. మహిళల భద్రత ఎలా ఉందో చూసేందుకు స్వయంగా రాత్రివేళ రంగంలోకి దిగారు. ముందుగా పోలీసు కంట్రోల్ రూమ్కి కాల్ చేశారు. వారు సక్రమంగా రెస్పాండ్ అవుతున్నట్లు గుర్తించారు. అనంతరం సామాన్యురాలిలా ఓ ఆటో ఎక్కారు. సదరు డ్రైవర్ ఆమె చెప్పిన చోట క్షేమంగా దించాడు. మహిళల భద్రతా పరిశీలన కోసం ఆమె ఇలా స్వయంగా రంగంలోకి దిగడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Similar News
News September 30, 2024
త్వరగా నిద్ర పట్టాలంటే..
మారిన ఆహారపు అలవాట్లతో నిద్రలేమి సమస్య పెరుగుతోంది. దీంతో చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారు.
*పడుకునే ముందు కంప్యూటర్, ఫోన్లు ఎక్కువగా వాడొద్దు. దీంతో కళ్లు దెబ్బతినే ప్రమాదమూ ఉంది.
*బ్రీతింగ్ వ్యాయామం చేయాలి. ఉదయం గంటసేపు వర్కౌట్స్ చేయాలి.
*లైటింగ్, సౌండ్ లేకుండా చూసుకోవాలి.
*రాత్రి భోజనంలో ఆకుకూరలు, కివీ పండ్లు, డెయిరీ పదార్థాలు ఉండేలా చూసుకోండి.
News September 30, 2024
బజ్జీలు ఉద్దెరకు ఇవ్వలేదని సలసల కాగుతున్న నూనెను..
TG: మిరపకాయ బజ్జీలు ఉద్దెరకు ఇవ్వలేదని కాగుతున్న నూనెను యజమానిపై పోసిన ఘటన గద్వాల జిల్లా కేటిదొడ్డి మం. గువ్వలదిన్నెలో జరిగింది. నిన్న రాత్రి వినోద్ అనే వ్యక్తి ఓ హోటల్కు వెళ్లి బజ్జీలు ఇవ్వాలని, డబ్బులు మళ్లీ ఇస్తానని అడిగాడు. యజమాని బుజ్జన్న గౌడ్ ఇవ్వనని చెప్పడంతో వినోద్ కోపంతో పొయ్యిపై కాగుతున్న నూనెను అతడిపై పోశాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తిపై కూడా పడటంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
News September 30, 2024
డయాబెటిస్కు ఔషధం తీసుకొచ్చిన చైనా?
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న డయాబెటిస్కు ఎట్టకేలకు పరిష్కారం దొరికినట్లు కనిపిస్తోంది. షిన్హువా వార్తాసంస్థ ప్రకారం.. చైనా శాస్త్రవేత్తలు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా టైప్-1 డయాబెటిస్ను పూర్తిగా తగ్గించారు. టియాంజిన్ ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్, పెకింగ్ వర్సిటీ వైద్యులు ఈ పరిశోధన నిర్వహించారు. 11 ఏళ్లుగా మధుమేహం ఉన్న రోగికి స్టెమ్ సెల్ మార్పిడి చేయగా 75 రోజులకి డయాబెటిస్ పూర్తిగా మాయమైంది.