News January 21, 2025
బ్రాండ్ వాల్యూ పరంగా ప్రపంచంలో పెద్ద ఐటీ కంపెనీలు

*యాక్సెంచర్ (అమెరికా)- రూ.3.47 లక్షల కోట్లు
*టీసీఎస్ (భారత్)- రూ.1.77 లక్షల కోట్లు
*ఇన్ఫోసిస్ (భారత్)- రూ.1.36 లక్షల కోట్లు
*ఐబీఎం కన్సల్టింగ్ (అమెరికా)- రూ.85వేల కోట్లు
*NTT DATA (జపాన్)- రూ.83వేల కోట్లు
*క్యాప్జెమినీ (ఫ్రాన్స్)- రూ.82వేల కోట్లు
*కాగ్నిజెంట్ (అమెరికా)- రూ.75వేల కోట్లు
*HCL టెక్ (భారత్)- రూ.74వేల కోట్లు
*విప్రో (భారత్)- రూ.50వేల కోట్లు
*Fujitsu (జపాన్)- రూ.34వేల కోట్లు
Similar News
News February 18, 2025
నేడు వల్లభనేని వంశీకి జగన్ పరామర్శ

AP: విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పరామర్శించనున్నారు. బెంగళూరులో ఉన్న ఆయన ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ జిల్లా జైలు వద్దకు చేరుకుంటారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
News February 18, 2025
సోషల్ మీడియా వాడకంలో వెనుకబడిన ఆ ఎమ్మెల్యేలు?

AP: సోషల్ మీడియా వాడకంలో 65మందికి పైగా TDP ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్నట్లు ఆ పార్టీ సమీక్షలో వెల్లడైనట్లు సమాచారం. సమీక్ష ప్రకారం.. ఆయా ఎమ్మెల్యేలు సోషల్ మీడియా వాడకం అంతంతమాత్రంగానే ఉంది. ప్రజల్లోకి వెళ్లేందుకు సామాజిక మాధ్యమాలు చాలా శక్తిమంతమైనవని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతున్నా ఆ నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. దీంతో అధినేత వారికి త్వరలో స్వయంగా క్లాస్ తీసుకుంటారని సమాచారం.
News February 18, 2025
కుంభమేళా పొడిగింపు..? యూపీ సర్కారు జవాబు ఇదే

భక్తుల రద్దీని, డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మహా కుంభమేళాను మరో రెండు రోజుల పాటు పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలపై యూపీ సర్కారు స్పందించింది. అలాంటి ఆలోచనలేవీ లేవని తేల్చిచెప్పింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ నెల 26న మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని వివరించింది. తాము అధికారికంగా చెబితే తప్ప.. సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని సూచించింది.