News March 30, 2024
25ఏళ్లలో భారీగా పడిపోనున్న ప్రపంచ జనాభా!

ప్రపంచ దేశాల జనాభాపై లాన్సెట్ జర్నల్ పరిశోధనలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. 25ఏళ్లలో 155 దేశాలు/టెర్రిటరీల్లో జనాభా గణనీయంగా పడిపోనుందని పరిశోధకులు తెలిపారు. 2100కు ఆ దేశాల సంఖ్య 198కు చేరడమే కాక జననాల రేటు మరణాల రేటు కంటే తక్కువగా ఉండనుందట. ఈ నేపథ్యంలో రానున్న మార్పులు ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News November 19, 2025
బిహార్ సీఎంగా మరోసారి నితీశ్ కుమార్

బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ సభాపక్ష నేతగా నితీశ్ పేరును BJP ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రేపు ఉ.11.30 గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో 10వ సారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు మరో 19మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 202 సీట్లు సాధించింది.
News November 19, 2025
ఎర్రకోట నుంచి కశ్మీర్ వరకు దాడులు చేయగలం: పాక్ నేత

ఇండియానే లక్ష్యంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మరోసారి రుజువైంది. ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు టెర్రర్ గ్రూపులతో దాడులు చేస్తామని పాక్ నేత చౌదరి అన్వరుల్ హక్ హెచ్చరించారు. ఇప్పటికే తాము ఈ పని చేశామని, వారు బాడీలను లెక్కించలేకపోతున్నారంటూ విషం కక్కారు. బలూచిస్థాన్లో జోక్యం చేసుకుంటే ఇలాగే జరుగుతుందన్నారు. ఎర్రకోట ఆత్మాహుతి దాడి, పహల్గామ్ అటాక్లనే అతను పరోక్షంగా ప్రస్తావించారు.
News November 19, 2025
DRDO CFEESలో అప్రెంటిస్ పోస్టులు

DRDO అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్ప్లోజివ్& ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES) 38 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 10 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI ఉత్తీర్ణులై, 18- 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్లో సడలింపు ఉంది. ముందుగా ncvtmis.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టైపెండ్ నెలకు రూ.9600 చెల్లిస్తారు. https://www.drdo.gov.in/


