News March 30, 2024

25ఏళ్లలో భారీగా పడిపోనున్న ప్రపంచ జనాభా!

image

ప్రపంచ దేశాల జనాభాపై లాన్సెట్ జర్నల్ పరిశోధనలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. 25ఏళ్లలో 155 దేశాలు/టెర్రిటరీల్లో జనాభా గణనీయంగా పడిపోనుందని పరిశోధకులు తెలిపారు. 2100కు ఆ దేశాల సంఖ్య 198కు చేరడమే కాక జననాల రేటు మరణాల రేటు కంటే తక్కువగా ఉండనుందట. ఈ నేపథ్యంలో రానున్న మార్పులు ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News January 21, 2026

తెలంగాణ వర్సిటీ పీఆర్ఓగా డాక్టర్ కె.వి. రమణచారి

image

TU పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO)గా ఇంగ్లీష్ విభాగానికి చెందిన డాక్టర్ కె.వి. రమణచారి బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. గతంలో పలు కీలక అడ్మినిస్ట్రేటివ్ పదవులు నిర్వహించిన రమణచారి.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు వీసీకి, రిజిస్ట్రార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వర్సిటీ అధికారులు ఆయనను అభినందించారు.

News January 21, 2026

కొనసాగిన నష్టాలు

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపారు. ఒకానొక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల నష్టాల్లోకి వెళ్లింది. మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకొని చివరికి 270 పాయింట్ల నష్టంతో 81,909 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 25,157 వద్ద సెటిల్ అయింది.

News January 21, 2026

అమరావతికి చట్టబద్ధత.. పార్లమెంటులో బిల్లు!

image

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపైనా నోట్ ఇచ్చింది. కాగా ఏ తేదీ నుంచి రాజధానిగా గుర్తించాలో చెప్పాలని కేంద్రం కోరినట్లు సమాచారం.