News November 26, 2024
తిరుమల ఆలయ హుండీలో చోరీ

తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీ నుంచి ఓ భక్తుడు నగదు చోరీ చేశాడు. తమిళనాడుకు చెందిన వేణులింగం రూ.15వేలు తీసినట్లు అధికారులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఈనెల 23న మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి డబ్బు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు.
Similar News
News November 27, 2025
PDPL: ‘పంచాయతీ ఎన్నికలు కట్టుదిట్టంగా నిర్వహించాలి’

పంచాయతీ ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. తొలి విడతలో 99 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ నవంబర్ 27న విడుదల అవుతుంది. 27–29న నామినేషన్లు స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 1న అప్పీలు, 2న పరిష్కారం, 3న ఉపసంహరణ. నామినేషన్ కేంద్రాల్లో 100 మీ. భద్రతా పరిమితి, టి-పోల్లో డేటా నమోదు తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు.
News November 27, 2025
ఆ బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేయరు: RJD

RJD చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి ఉంటున్న నివాసాన్ని ఆమె ఖాళీ చేయరని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఆ పార్టీ బిహార్ చీఫ్ మంగానీ లాల్ మండల్ తెలిపారు. జీవితకాల నివాసం కింద ఆ బంగ్లాను కేటాయించినట్లు చెప్పారు. పట్నాలోని అన్నే మార్గ్లో CM నివాసం ఎదుట రబ్రీదేవి, లాలూ 2 దశాబ్దాలుగా ఉంటున్నారు. కాగా దాన్ని ఖాళీ చేసి హార్డింజ్ రోడ్ 39 బంగ్లాకు మారాలంటూ ఇటీవల నితీశ్ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా RJD స్పందించింది.
News November 27, 2025
హైడ్రాపై కర్ణాటక బృందం ప్రశంసలు

TG: హైడ్రా (HYDRAA) చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించిన కర్ణాటక ప్రతినిధులు ఈ మోడల్ను బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు. బతుకమ్మకుంట, నల్లచెరువు వంటి పునరుద్ధరించిన చెరువులను పరిశీలించారు. ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణలో హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశంసించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో జరిగిన చర్చలో దీని అమలు విధానం, విభాగాల సమన్వయం గురించి తెలుసుకున్నారు.


