News July 17, 2024
వారికి జీతాలు విడుదల

AP: కేజీబీవీ టీచర్లు, సీఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు సమగ్రశిక్ష పరిధిలోని ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న మే, జూన్ నెలలకు సంబంధించి రూ.122.23 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఉద్యోగుల జీతాలకు రూ.105.2కోట్లు, విద్యార్థుల భోజన నిర్వహణ ఖర్చులకు రూ.17.02 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 11, 2026
తప్పు ఒప్పుకొన్న X.. అశ్లీల పోస్టుల తొలగింపు

కేంద్ర ప్రభుత్వం హెచ్చరికతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X దిగొచ్చింది. గ్రోక్లో అశ్లీల కంటెంట్పై గతవారం <<18795355>>IT శాఖ సీరియస్<<>> అవ్వడంతో X యాజమాన్యం స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాట్ఫామ్లో ఉన్న 3,500 అశ్లీల పోస్టులను బ్లాక్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన 600 అకౌంట్లను పూర్తిగా తొలగించింది. తమ మోడరేషన్లో లోపాలున్నాయని అంగీకరించింది. భారత చట్టాలకు లోబడి పనిచేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.
News January 11, 2026
పిండి వంటల్లో బెల్లం వాడుతున్నారా?

సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా పిండి వంటల ఘుమఘుమలే. అయితే తీపి వంటకాల్లో పంచదారకు బదులు బెల్లం వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం, విటమిన్లు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. శరీరంలో చేరిన మలినాలను బయటకు పంపేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
News January 11, 2026
సంక్రాంతి: సిరి సంపదల కోసం ఆరోజు ఏం చేయాలంటే?

సంక్రాంతినాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యుడిని ఆరాధించాలి. హరిదాసులు, గంగిరెద్దులను సత్కరిస్తే వల్ల విష్ణుమూర్తి, నందీశ్వరుల కృప లభిస్తుంది. నువ్వుల నీటితో శివాభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయని, ఆర్థికాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పేదలకు వస్త్రాలు, అన్నదానం చేయడం, గోపూజ నిర్వహించడం వల్ల పాపాలు తొలగి, పుణ్యఫలం లభిస్తుంది.


