News November 30, 2024
అప్పుడు వరి వేస్తే ఉరి.. ఇప్పుడు రూ.500 బోనస్: రేవంత్

TG: గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్ అంటే, ఇప్పుడు తాము వరి పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇది చూసి BRS నేతల గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. ఏడాదిలోపే 25 లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. అన్నదాతలకు ఉచిత కరెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో MPగా ఉండి MBNR జిల్లాకు KCR ఏం చేశారో చెప్పాలి’ అని రేవంత్ డిమాండ్ చేశారు.
Similar News
News February 15, 2026
శివుడిని లయకారుడు అని ఎందుకు అంటారు?

సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యాలలో శివుడు ‘లయకారుడు’. అంటే ఈ విశ్వాన్ని ఉపసంహరించేవాడు అని అర్థం. అయితే ఈ లయం ప్రతికూలమైనది కాదు. పాతది అంతమైతేనే కొత్త సృష్టికి మార్గం సుగమమవుతుంది. శివుడు తన తాండవంతో అజ్ఞానం, అహంకారాన్ని లయం చేసి, ఆత్మను దైవంలో విలీనం చేస్తాడు. మనలో చెడు ఆలోచనలను నశింపజేసి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఆయనను సృష్టి చక్రంలో మార్పును తెచ్చే పరమాత్మగా పూజిస్తారు.
News February 15, 2026
ప్రపంచంలోనే తొలి ఇంజినీరింగ్ కాలేజీ.. ఎక్కడో తెలుసా?

ఇంజినీరింగ్ విద్యకు ఎంతో క్రేజ్ ఉంది. దానికి తగ్గట్లే ఎన్నో వర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా వెలిశాయి. ఈ విద్యకు 300 ఏళ్ల కిందటే నాంది పడింది. JAN 18, 1707న చెక్ రిపబ్లిక్ రాజధాని అయిన ప్రేగ్లో చెక్ టెక్నికల్ వర్సిటీని రోమన్ చక్రవర్తి జోసెఫ్-1 స్థాపించారు. ఇదే వరల్డ్స్ ఫస్ట్ ఇంజినీరింగ్ వర్సిటీ. సైనిక కోటలు, మౌలిక సదుపాయాల నిర్మాణాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారు. క్రమంగా దీన్ని విస్తరించారు.
News February 15, 2026
INDvsPAK: పాక్ టార్గెట్ 176

T20WC: పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 175/7 స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 77(40 B) క్రీజులో ఉన్నంత వరకు స్కోర్ పరిగెత్తినా తర్వాత నెమ్మదించింది. అభిషేక్ 0, తిలక్ వర్మ 25, సూర్య 32, హార్దిక్ 0, దూబే 27, రింకూ సింగ్ 11* పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అయూబ్ 3, సల్మాన్ అఘా, తారిఖ్, షాహీన్ తలో వికెట్ తీశారు. ఆ జట్టులో 18 ఓవర్లను స్పిన్నర్లే వేయడం గమనార్హం. పాక్ లక్ష్యం 176.


