News November 30, 2024
అప్పుడు వరి వేస్తే ఉరి.. ఇప్పుడు రూ.500 బోనస్: రేవంత్

TG: గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్ అంటే, ఇప్పుడు తాము వరి పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇది చూసి BRS నేతల గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. ఏడాదిలోపే 25 లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. అన్నదాతలకు ఉచిత కరెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో MPగా ఉండి MBNR జిల్లాకు KCR ఏం చేశారో చెప్పాలి’ అని రేవంత్ డిమాండ్ చేశారు.
Similar News
News January 6, 2026
ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

HYDలోని <
News January 6, 2026
ఈ చేప ఖరీదు రూ.28కోట్లు!

టోక్యోలోని టొయోసు మార్కెట్లో నిర్వహించిన వేలంలో ఒక బ్లూఫిన్ ట్యూనా చేప రికార్డు ధర పలికింది. 243kgs బరువున్న ఈ చేపను సుమారు రూ.28Crకు ($3.2M) ఓ రెస్టారెంట్ యజమాని దక్కించుకున్నారు. జపాన్లోని ‘Oma’ తీరంలో దొరికిన ఇలాంటి చేపలు రుచికరంగా ఉంటాయని పేరుంది. అలాగే అక్కడి సంప్రదాయం ప్రకారం న్యూఇయర్ తొలి వేలంలో అత్యధిక ధరకు చేపను కొంటే అదృష్టమని భావిస్తారు. అందుకే వ్యాపారులు ఎంత ఖర్చయినా వెనకాడరు.
News January 6, 2026
బంగ్లాదేశ్ హిందూ క్రికెటర్ను కెప్టెన్ చేసింది: జేడీయూ నేత

బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ను KKR జట్టు నుంచి <<18748860>>తొలగించడాన్ని<<>> JDU నేత KC త్యాగి తప్పుబట్టారు. ‘క్రీడలను రాజకీయాలు ప్రభావితం చేయకూడదు. బంగ్లాలో జరుగుతున్న వాటిపై మనం ఆందోళన చేస్తున్నాం. IPL నుంచి ఆ దేశ క్రికెటర్ను తొలగించాం. కానీ బంగ్లా జాతీయ జట్టుకు మైనారిటీ క్రికెటర్, హిందువు(లిటన్ దాస్)ను కెప్టెన్గా చేసింది. వాళ్లు బలమైన సందేశం పంపారు. మనం పునరాలోచించాలి’ అని చెప్పారు.


