News August 22, 2024

అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు రేవంత్

image

TG: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓ తెలంగాణ సీఎం నిరసన చేపట్టడం ఇది రెండోసారి. గతంలో 2021 నవంబర్ 18న వరి ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పటి సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ దగ్గర నిరసనకు దిగారు. ఈరోజు అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణను డిమాండ్ చేస్తూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈడీ కార్యాలయం దగ్గర CM రేవంత్ నిరసన చేపట్టారు.

Similar News

News October 28, 2025

Way2News ‘తుఫాను’ అప్‌డేట్స్

image

AP: మొంథా తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులకు పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ రాత్రి తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్‌డేట్‌లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.

News October 28, 2025

9PM నుంచి రేపు తెల్లవారుజాము వరకూ భారీ వర్షాలు: CBN

image

AP: 403 మండలాలపై మొంథా ప్రభావం చూపుతోందని CM CBN తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. 7 జిల్లాల్లో ఆగిపోయిన వాహనదారులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ రాత్రి 9PM నుంచి రేపు తెల్లవారుజాము వరకూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ రాత్రి 11.30 తర్వాత తుఫాన్ తీరం దాటవచ్చని చెప్పారు.

News October 28, 2025

ఆగిన రష్యన్ ఆయిల్ దిగుమతులు.. నెక్స్ట్ ఏంటి?

image

రష్యాలోని టాప్ ఎనర్జీ కంపెనీలపై US ఆంక్షల నేపథ్యంలో భారత రిఫైనరీలు కొత్తగా ఆయిల్ దిగుమతులపై వెనుకడుగు వేస్తున్నాయి. పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం. ఈ విషయంలో ప్రభుత్వం, సప్లయర్ల నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫ్రెష్ ఆయిల్ టెండర్ జారీ చేసిందని, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాట్ బయ్యింగ్‌కు సిద్ధమైందని తెలిసింది.