News September 11, 2024

పంట అమ్ముకునేందుకు ఎన్నో అడ్డంకులు

image

AP: రైతులు పంట పండించడం కంటే అమ్ముకునేందుకే ఎక్కువ కష్టపడుతున్నారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు నిర్దేశించిన మార్గదర్శకాలు అన్నదాతలకు ఇబ్బందిగా మారాయి. ఈ-క్రాప్‌లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే పంట అమ్ముకోలేరు. రైతు సేవా కేంద్రంలో చెప్పిన రోజే మిల్లుకు తీసుకెళ్లాలి. వ్యవసాయశాఖ అంచనా వేసిన దిగుబడి కంటే ఎక్కువగా వస్తే అంగీకరించరు. ఈ నిబంధనలను సడలించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Similar News

News November 15, 2025

పాపం తేజస్వీ.. సీఎం అవుదామనుకుంటే?

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల <<18289323>>ఫలితాలు<<>> RJD నేత తేజస్వీ యాదవ్‌కు పీడకలను మిగిల్చాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ 75 చోట్ల విజయం సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో మరిన్ని సీట్లు పెరుగుతాయని, తమ కూటమి అధికారంలోకి వస్తుందని తేజస్వీ భావించారు. అంతేకాకుండా ఈసారి సీఎం కుర్చీ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు ఆర్జేడీకి 25 సీట్లు మాత్రమే కట్టబెట్టి ముఖ్యమంత్రి కావాలన్న తేజస్వీ ఆశలను ఆవిరి చేశారు.

News November 15, 2025

CSK నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!

image

ఓపెనర్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్(CSK) వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కాన్వే ట్వీట్ చేశారు. మూడేళ్లు పాటు మద్దతుగా నిలిచిన CSK ఫ్యాన్స్‌కు Xలో ధన్యవాదాలు తెలియజేశారు. ఎల్లో జెర్సీతో ఉన్న జ్ఞాపకాలను షేర్ చేశారు. ఐపీఎల్‌లో CSK తరఫున 29 మ్యాచులు ఆడిన కాన్వే 43.2 సగటుతో 1080 పరుగులు చేశారు. ఇందులో 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఓపెనర్‌గా జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందించారు.

News November 15, 2025

బిహార్ రిజల్ట్స్: 5 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించింది. జోకిహట్, బహదుర్గంజ్, కొచ్చదామన్, అమౌర్, బైసీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అభ్యర్థులందరికీ 20వేలకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. 2020 ఎన్నికల్లో ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి అదనంగా బహదుర్గంజ్ స్థానంలో గెలవడం విశేషం. ఎంఐఎం ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసింది.